Balakrishna: `అఖండ` హిట్ అనంతరం నటసింహం నందమూరి బాలకృష్ణ.. ప్రముఖ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో తన నెక్స్ ప్రాజెక్ట్ను `ఎన్బీకే 107` వర్కింగ్ టైటిల్తో ప్రారంభించిన సంగతి తెలిసిందే. శ్రుతి హాసన్ ఇందులో హీరోయిన్గా నటిస్తుండగా.. దునియా విజయ్ విలన్ గా, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
చకచకా షూటింగ్ను పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం దసరా కానుకగా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా పూర్తైన అనంతరం బాలయ్య స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఈ మూవీని షురూ చేయనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాలో బాలయ్య 50 ఏళ్ల వయసుగల తండ్రి పాత్రలో కనిపించనున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఆయన కూతురు పాత్రలో `పెళ్లి సందD` బ్యూటీ శ్రీలీల నటించనుంది. అలాగే బాలయ్యకు జోడీగా మెహ్రీన్ కనిపించనుందని మొదట ప్రచారం జరిగినా.. తాజాగా తెరపైకి ప్రియమణి పేరు వచ్చింది. అనిల్ రావిపూడి ప్రియమణినే హీరోయిన్గా ఎంపిక చేశారని జోరుగా వార్తలు వస్తున్నాయి. దీంతో బాలయ్యకు జోడీగా ప్రియమణి వద్దు బాబోయ్ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
అయితే వీరి భయానికి కారణం లేకపోలేదు. గతంలో బాలయ్య, ప్రియమణిలు కలిసి మహదేవ్ దర్శకత్వంలో `మిత్రుడు` అనే సినిమా చేశారు. విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన ఈ చిత్రం 2009లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. దాంతో బాలయ్య, ప్రియమణిలు మళ్లీ జతకట్టలేదు. అందుకే ప్రియమణిని హీరోయిన్గా తీసుకుంటే బాలయ్య సినిమా రిజెల్ట్ ఎక్కడ తేడా కొడుతుందో అని ఫ్యాన్స్ వర్రీ అవుతున్నారు.