NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలె `ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ మల్టీస్టారర్తో ప్రేక్షకులను పలకరించి భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిన ఈ చిత్రం తాజాగా 500 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుని రికార్డు కూడా సృష్టించింది. ఇక ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివతో తన తదుపరి చిత్రం చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడు.
`ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్తో ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇది కంప్లీట్ అయిన వెంటనే ఎన్టీఆర్ `కేజీఎఫ్`తో నేషనల్ వైడ్గా ఫేమస్ అయిన ప్రశాంత్ నీల్తో ఓ సినిమాను చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్పై ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ సైతం వచ్చింది. దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో అతృతగా ఎదురు చూస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇలాంటి తరుణంలో ఓ షాకింగ్ వార్త నెట్టింట వైరల్గా మారింది. ఈ మధ్యే `కేజీఎఫ్ 2`తో సక్సెస్ అందుకున్న ప్రశాంత్ నీల్.. `కేజీఎఫ్ 3` కూడా ఉంటుందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అయితే కేజీఎఫ్ 3కి సంబంధించిన కథా నిర్మాణం జరుగుతోందని, ఈ ఏడాది నవంబర్ నుంచే సినిమాను ప్రారంభిస్తామని కేజీఎఫ్ నిర్మాత విజయ్ కిరగందూర్ చెప్పినట్టు నిన్న వార్తలు తెగ హల్ చల్ చేశాయి.
ప్రస్తుతం ప్రభాస్ తో `సలార్` చేస్తున్న ప్రశాంత్ నీల్.. అది పూర్తైన వెంటనే కేజీఎఫ్ 3ని స్టార్ట్ చేస్తాడని ప్రచారం జరిగింది. ఇది ఎంత వరకు నిజం అన్నది పక్కన పెడితే.. ఈ ప్రచారం విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం బాగా హర్ట్ అవుతున్నారు. సలార్ తర్వాత ప్రశాంత్ `కేజీఎఫ్ 3`ని ప్రారంభిస్తే.. ఎన్టీఆర్ సినిమా ఇంకెప్పుడు పట్టాలెక్కుతుందంటూ ఆందోళన చెందుతున్నారు.