NTR 30: ఇటీవల విడుదలైన `ఆర్ఆర్ఆర్`తో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ను కొరటాల శివతో చేయబోతున్న సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్తో పట్టాలెక్కబోతున్న ఈ చిత్రం ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై హై బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మితం కాబోతోంది.
నిన్న ఎన్టీఆర్ బర్త్డే కావడంతో మేకర్స్ `ఎన్టీఆర్ 30`కి సంబంధించిన మోషన్ పోస్టర్ వీడియోను బయటకు వదిలారు. ఇందులో ఎన్టీఆర్ లుక్ `అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు అవసరానికి మించి తను ఉండకూదని… అప్పుడు భయానికి తెలియాలి తను రావాల్సిన సమయం వచ్చిందని… వస్తున్నా` అంటూ ఈ వీడియోలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ వేరె లెవల్లో వైరల్ అయింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మోషన్ పోస్టర్ వీడియోలో ఈ సినిమాకు దర్శకుడిగా కొరటాల శివ, మ్యూజిక్ డైరెక్టర్గా అనిరుధ్ రవిచందర్, సినిమాటోగ్రఫర్గా రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్గా సాబు సిరిల్, ఎడిటర్గా శ్రీకర్ ప్రసాద్ లు వర్క్ చేయనున్నారని కన్ఫామ్ అయింది. కానీ, హీరోయిన్ ఎవరన్నది మాత్రం అనౌన్స్ చేయలేదు. అయితే గత కొద్ది రోజుల నుంచీ ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని ఎన్టీఆర్కు జోడీగా నటించనుందని వార్తలు వస్తున్నాయి.
దిశా పటాని గతంలో వరుణ్ తేజ్తో `లోఫర్` సినిమా చేయగా.. అది కాస్త బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఆ తర్వాత ఈ భామ బాలీవుడ్లోనే బిజీ అయింది. అయితే `ఎన్టీఆర్ 30`లో దిశా పటాని హీరోయిన్గా వద్దే వద్దంటున్నారు కొందరు అభిమానులు. అందుకు కారణం లేకపోలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే దిశా పటాని.. తరచూ బోల్డ్ పిక్స్, బికినీ ఫొటోలతో రచ్చ రచ్చ చేస్తుంటుంది. శ్రుతిమించిన గ్లామర్తోనే పాపులారిటీని సంపాదించుకున్న దిశీ పటానికి సక్సెస్ రేటు మాత్రం చాలా తక్కువ. అందువల్లనే ఆమెను హీరోయిన్గా వద్దంటున్నారని టాక్ నడుస్తోంది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!