అప్పుడెప్పుడో సీనియర్ ఎన్టీఆర్-బాలకృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ మరియు మహేష్ బాబు కలిసి నటించిన చిత్రాల్లోనే తండ్రీకొడుకుల కాంబినేషన్ చూసేవారు. అయితే ఇప్పుడు అడపాదడపా ఒకటి రెండు సినిమాల్లో తండ్రీ కొడుకులు కలిసి నటిస్తున్నా…. దర్శకులు ఆ నేపథ్యంలో కావలసిన స్క్రిప్ట్ లను ఎక్కువగా రాసుకోవడం లేదు.
అయితే చాలా సంవత్సరాల తర్వాత అందరిలో ఆసక్తి రేపే తండ్రి-కొడుకుల కలయికలో ఒక కథా చిత్రం తెరకెక్కించేందుకు తమిళ యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు పూనుకున్నాడు. రజినీకాంత్ యొక్క అతిపెద్ద అభిమాని గా చెప్పుకునే కార్తీక్ సుబ్బరాజు గతంలో జిగర్థంద ( తెలుగులో గద్దలకొండ గణేష్), పేటా చిత్రాలను తెరకెక్కించాడు.
ఇప్పుడు విలక్షణ నటుడు విక్రమ్ మరియు అతని కొడుకు ధ్రువ్ విక్రమ్ ఇద్దరిని ఒకే సినిమాలో పెట్టి ఒక చిత్రాన్ని డైరెక్ట్ చేయనుండడం విశేషం. విక్రమ్ కొడుకు ధ్రువ్ తమిళ ‘అర్జున్ రెడ్డి’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఇక ఈ సినిమాకి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ బాణీలు సమకూరుస్తుండగా లలిత్ కుమార్ మరియు 7 స్క్రీన్ స్టూడియో నిర్మించనున్నారు.