Telugu biggest disaster movie: 2022 ప్రారంభంలోనే అతి పెద్ద డిజాస్టర్గా నిలిచిందో చిత్రం. అదేదో కాదు `అతిథి దేవోభవ`. ఆది సాయికుమార్ హీరోగా పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నువేక్ష హీరోయిన్గా నటించింది. శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్పై రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. రోహిణి, సప్తగిరి తదితరులు కీలక పాత్రలను పోషించగా.. శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.
కరోనా కారణంగా ఆర్ఆర్ఆర్ వాయిదా పడటంతో.. దాని స్థానంలో జనవరి 7న గ్రాండ్గా అతిథి దేవోభవ చిత్రాన్ని విడుదల చేశారు మేకర్స్. చాలా కాలం నుంచి వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న ఆది.. ఈ సినిమాతో ఎలాగైన హిట్ కొట్టాలని భావించారు. కానీ, ఆది ఆశలన్నీ నిరాశలే అయ్యాయి. ఈ సినిమా కథలోని మెయిన్ థీమ్ పర్వాలేదు అనిపించినా దర్శకుడు కథనం మలచడంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు. అలాగే సినిమాలో చెప్పుకోడానికి రెండు పాటలు మినహా ఆకర్షించే అంశాలు ఏమీ లేవు.
పైగా ప్రమోషన్స్ కూడా సరిగ్గా నిర్వహించకపోవడం వల్ల.. ఈ సినిమాకు చాలా తక్కువ ఓపినింగ్స్ వచ్చాయి. అతిథి దేవో భవ చిత్రానికి రూ.1.31 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు ఈ చిత్రం రూ.1.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ, విడుదలై మూడు రోజులు గడుస్తున్నా ఈ చిత్రం కేవలం రూ.28 లక్షలను మాత్రమే వసూల్ చేసింది. ఇంత దారుణమైన కలక్షన్స్ ఈమధ్య కాలంలో ఏ సినిమాకు రాలేదని చెప్పొచ్చు. దీంతో 2022లో అతి పెద్ద డిజాస్టర్గా నిలిచి మొట్ట మొదటి తెలుగు సినిమాగా అతిథి దేవోభవనే నిలిచింది.