Tollywood: టాలీవుడ్ Tollywood పై కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ గట్టిగానే పడుతోంది. నిజానికి కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత టాలీవుడ్ సక్సెస్ అయినట్టు బాలీవుడ్ తోసహా మరే ప్రాంతీయ సినీ పరిశ్రమ లాభాల బాట పట్టలేదు. జనవరి నుంచి ఏప్రిల్ వరకూ ప్రతి నెలా ఒక్కో బ్లాక్ బస్టర్ పడటం గొప్ప విషయం. కరోనా తర్వాత ప్రేక్షకులు ధియేటర్లకు వస్తారా అనే ప్రశ్నలకు.. ‘సినిమా అంటే ఎంత ఇష్టమో’ ధియేటర్లకు క్యూ కట్టి చూపించారు. డిసెంబర్ లో సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో తెలుగు సినిమాల విడుదలలు ప్రారంభమయ్యాయి.
సంక్రాంతికి వచ్చిన రవితేజ ‘క్రాక్’ సూపర్ హిట్టవడం.. జనాలు ధియేటర్లకు రావడంతో సినీ వర్గాల్లో ధైర్యం వచ్చింది. ఫిబ్రవరిలో వైష్ణవ్ తేజ్ తొలి సినిమా ‘ఉప్పెన’కు ఓటీటీ నుంచి భారీ ఆఫర్ వచ్చినా చిరంజీవి సలహా మీద ధియేటర్లలోనే విడుదల చేసారు నిర్మాతలు. నిజంగానే జనాలు ఉప్పెనలా ధియేటర్లకు వచ్చారు. ఏకంగా డెబ్యూ హీరోగా తెలుగులో రామ్ చరణ్, బాలీవుడ్ లో 20ఏళ్ల క్రితం హృతిక్ రోషన్ పేరున ఉన్న రికార్డులను దాటి 100 కోట్ల కలెక్షన్లతో రికార్డులు క్రియేట్ చేసింది. మార్చిలో నవీన్ పోలిశెట్టి ‘జతిరత్నాలు’ మరో సెన్సేషన్. చిన్న సినిమా ఏకంగా 65 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. హీరోతో సంబంధం లేదు.. సినిమా బాగుంటే ఆదరిస్తామని ప్రేక్షకులు నిరూపించారు.
కరోనా తర్వాత విడుదలైన పెద్ద సినిమా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’. 3ఏళ్ల తర్వాత వస్తున్న పవన్ సినిమా కావడంతో అంచనాలు ఎక్కువయ్యాయి. కరోనా సెకండ్ వేవ్ కూడా ప్రారంభమైంది. ఈ దశలో వకీల్ సాబ్ అందరి అంచనాలను అందుకుంది. భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఏపీలో కొన్ని ఇబ్బందులు, కరోనా పరిస్థితులను కూడా దాటి ప్రేక్షకులు ధియేటర్లకు క్యూ కట్టారు. ఇండస్ట్రీకి మరో 100 కోట్ల సినిమా అయింది. ఇలా కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత టాలీవుడ్ సాధించిన విజయాలు మిగిలిన సినీ పరిశ్రమలను షాక్ కు గురి చేశాయి. కరోనాతో గతేడాది కుదేలైన సినీ పరిశ్రమకు, త్వరలో విడుదలయ్యే భారీ సినిమాలకు ఈ విజయాలు భరోసా ఇచ్చాయనడంలో సందేహం లేదు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!