Brahmanandam: కమెడియన్ బ్రహ్మానందం రెండో కొడుకు సిద్ధార్థ పెళ్లి ఇటీవల అంగరంగ వైభవంగా జరగడం తెలిసిందే. ఆగస్టు 18 వ తారీకు హైదరాబాద్ గచ్చిబౌలి అన్వయ్య కన్వెన్షన్ లో జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ సినిమా ఆటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఇక సినిమా ఇండస్ట్రీ నుండి బాలకృష్ణ, మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్, కోటా శ్రీనివాసరావు, రాజశేఖర్ జీవిత దంపతులు, రామ్ చరణ్ ఉపాసన దంపతులతో పాటు చిరంజీవి సతీమణి సురేఖ, పెద్దమ్మాయి సుస్మిత, శ్రీకాంత్ కుటుంబ సభ్యులు విచ్చేయడం జరిగింది.
సాయికుమార్ ఫ్యామిలీ, మంచు విష్ణు దంపతులు, మంచు మనోజ్ దంపతులు, దర్శకులు కోదండరామిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, త్రివిక్రమ్ శ్రీనివాస్, శేఖర్ కమ్ముల, నటులు రావు రమేష్, ఆలీ ఫ్యామిలీ, ఎల్బీ శ్రీరామ్, నిర్మాతలు శివలంక కృష్ణ ప్రసాద్, బెల్లంకొండ సురేష్, అచ్చిరెడ్డి, ఆదిశేషగిరిరావు, కేఎల్ నారాయణ, రఘుబాబు తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. బ్రహ్మానందం రెండో కొడుకు చాలావరకు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ విదేశాలలో గడపడం జరిగింది. అక్కడే ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. అందుకే సిద్ధార్థ గురించి తెలిసింది తక్కువే. అయితే బ్రహ్మానందం తన రెండో కొడుకుకి హైదరాబాద్ కి చెందిన ఐశ్వర్య అనే అమ్మాయితో వివాహం చేయడం జరిగిందట.
ఇక అమ్మాయి కొన్ని వందల కోట్ల ఆస్తికి వారసురాలని సమాచారం. బూర వినయ్ కుమార్, పద్మజా దంపతుల పుత్రిక ఐశ్వర్య. ఐశ్వర్య తల్లి పద్మజ హైదరాబాద్ లో పేరు ఉన్న గైనకాలజిస్ట్, ఐ వి ఎఫ్ స్పెషలిస్ట్. ఐశ్వర్య సైతం ఎంబిబిఎస్ పూర్తి చేయడం జరిగింది. డాక్టర్ ఫ్యామిలీకి చెందిన డాక్టర్ని బ్రహ్మానందం కోడలిగా తెచ్చుకున్నారు. ఐశ్వర్య తో పాటు ఆమె కుటుంబం బ్రహ్మానందం కి ఎంతగానో నచ్చిందట. దీంతో నిశ్చితార్థం రోజే తన కాబోయే కోడలికి బ్రహ్మానందం డైమండ్ నెక్లెస్ బహుమతిగా ఇవ్వటం జరిగిందట. చాలావరకు బ్రహ్మానందం రెండో కోడలు.. చాలా కోట్లకి వారసురాలని దేశంలో అంబానీ స్థాయి దాకా ఆస్తులు కలిగిన అమ్మాయి అని టాక్.