ఈ మధ్య తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలను పెంచి, ఆసక్తిని రేపుతున్న చిత్రం `సాహో`. ప్రభాస్ నటించిన చిత్రమే కాదు.. `బాహుబలి` తర్వాత ఆయన నటించిన చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా విషయంలో రీసెంట్గా చిన్న సమస్య వచ్చింది. సినిమాకు సంగీతం అందించాల్సిన శంకర్ ఎహ్సాన్ లాయ్ ప్రాజెక్ట్ నుండి కొన్ని కారణాలతో తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇతర కంపోజర్స్తో కలిసి పనిచేయాలని నిర్మాణ సంస్థ కోరిందని, అది తమకు ఇబ్బందిగా మారిందని వారు ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఇప్పుడు నిర్మాణ సంస్థ శంకర్ ఎహ్సాన్ లాయ్ స్థానంలో జిబ్రాన్ను తీసుకుంటుందని వార్తలు వినపడుతు్నాయి. యు.వి.క్రియేషన్స్లో జిల్, విశ్వరూపం, విశ్వరూపం 2 సహా పలు చిత్రాలకు జిబ్రాన్ సంగీత దర్శకుడిగా పనిచేశారు.
previous post
next post
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!