Rajamouli Pawan: రాజమౌళి తీసే సినిమాలకు చాలా వరకు స్టోరీలు అందించేది ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ అని అందరికీ తెలుసు. అటువంటి విజయేంద్ర ప్రసాద్ కి ఇండస్ట్రీలో ప్రత్యేకమైన అభిమానం కలిగిన హీరో పవన్ కళ్యాణ్. ఈ విషయాన్ని ఆయన చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. “బాహుబలి” ఇంటర్వెల్ బ్యాంగ్ లో పట్టాభిషేకం సన్నివేశం టైంలో జనాల నుండి అరుపులు… భూమి దద్దరిల్లి పోవడం.. సన్నివేశానికి స్ఫూర్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు. “బాహుబలి” ప్రీ రిలీజ్ వేడుక సమయంలో…అడవి శేష్ ..నోట నుండి పవన్ “పంజా” మాట రాగానే ఆడియన్స్ నుండి విపరీతమైన సౌండ్ రావడం జరిగింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఆ సన్నివేశాన్ని దృష్టిలో పెట్టుకునే బాహుబలి ఇంటర్వెల్ బ్యాంగ్ రాసినట్లు తెలిపారు. ఇదంతా పక్కన పెడితే రాజమౌళి దర్శకత్వంలో పవన్ సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు ఎప్పటి నుండో వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే వీరిద్దరి కాంబినేషన్ కి సంబంధించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్.. సినిమా వచ్చే అవకాశాలు ఉన్నట్లు కామెంట్లు చేసినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. వీరిద్దరి కాంబినేషన్ కి సంబంధించి ఒక స్టోరీ సిద్ధం చేసినట్లు త్వరలోనే రాజమౌళికి వినిపించ నున్నట్లు విజయేంద్రప్రసాద్ తెలిపారట. వరల్డ్ క్లాస్ ఫిలింగా ఈ సినిమా స్టోరీ సిద్ధం చేసినట్లు టాక్ నడుస్తోంది.
ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోయే సినిమా ప్రాజెక్టు పై ఫోకస్ పెట్టడం జరిగింది. దాదాపు 800 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. బాహుబలి 2, RRR వంటి హిస్టరీ క్రియేట్ చేసిన సినిమాల తర్వాత రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మామూలుగానే రాజమౌళి సినిమా అంటే చాలా సంవత్సరాలు పడుతుంది. మరి మహేష్ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఈ క్రమంలో విజయేంద్రప్రసాద్ కల పవన్ తో రాజమౌళి ప్రాజెక్టు ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ నీ హీరోగా పెట్టి రాజమౌళితో సినిమా చేయించాలనేది తన కోరిక అని విజయేంద్రప్రసాద్ చెప్పినట్లు వార్తలు రావడం పట్ల పవన్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.