Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ను ఖుషీ చేసే ఓ అదిరిపోయే గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా తొలిసారి కలిసి నటించిన చిత్రం `భీమ్లా నాయక్`. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. మలయాళంలో హిట్టైన `అయ్యప్పనుమ్ కోషియుమ్`కు ఇది రీమేక్గా రూపుదిద్దుకుంది.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగ వంశీ ఈ మూవీని నిర్మించారు. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా.. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. భారీ అంచనాల నడుము 2022 ఫిబ్రవరి 25న విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. పవన్, రానాల నటన, త్రివిక్రమ్ అందించిన స్క్రీన్ ప్లే, తమన్ అందించిన మ్యూజిక్, సాగర్ టేకింగ్ సినిమాకు ప్లాస్ పాయింట్స్గా నిలిచాయి.
దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. అయితే కరోనా వచ్చిన దగ్గర నుంచీ థియేటర్స్లో విడుదలైన సినిమాలు మళ్లీ ఓటీటీల ద్వారా అందుబాటులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భీమ్లా నాయక్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థలు హాట్స్టార్, ఆహా కలిసి సాలిడ్ ధరకు దక్కించుకున్నాయి.
అంతేకాదు, మార్చి 25న సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు కూడా ప్రకటించాయి. అయితే ఒకరోజు ముందే అనగా మార్చి 24 నుండి భీమ్లా నాయక్ స్ట్రీమ్ కాబోతోంది. అవును, హాట్స్టార్ వారు కొద్ది సేపటి క్రితమే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ..ప్రత్యేక పోస్టర్ విడుదల చేశారు. మరి ఒకే రోజు ముందే భీమ్లా నాయక్ జాతర మొదలవుతుండటంతో.. ఫ్యాన్స్కు పూనకాలు ఖాయమని అంటున్నారు.
Surprise! Surprise!
Bheemla Nayak kasta jaldi ostunnadu…
24 hours early on 24th! Get ready?#BheemlaNayakOnHotstar@PawanKalyan @RanaDaggubati @DisneyPlusHS #Trivikram @saagar_chandrak @MenenNithya @iamsamyuktha_ @MusicThaman @NavinNooli @dop007 @vamsi84 pic.twitter.com/mUeXTxfhKl— DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) March 22, 2022