Puri Jagannath: టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. కొన్ని సంవత్సరాల పాటు సినిమాలు తీసే డైరెక్టర్ లకు భిన్నంగా నెలలో సినిమాలు చేసి ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేయటం ఒక్క పూరి జగన్నాథ్ కే… సాధ్యం. ఈ విషయాన్ని బాహుబలి డైరెక్టర్ రాజమౌళి కూడా ఒకానొక సమయంలో తెలియజేశారు. ఇండస్ట్రీలో దాదాపు పూర్తి పని అయిపోయింది అని అనుకున్న సమయంలో వరుస ప్లాపులు వస్తున్న క్రమంలో ఏ మాత్రం ఆత్మస్థైర్యం కోల్పోకుండా… 2019లో ఇస్మార్ట్ శంకర్ తో… సూపర్ డూపర్ హిట్ కొట్టడం జరిగింది. జులై 18 వ తారీకు రిలీజ్ అయిన ఈ సినిమా పూరి కెరియర్ లో మాత్రమే కాక.. హీరో రామ్ కెరీర్ లో కూడా అతి పెద్ద హిట్ సినిమాగా నిలిచింది. ముఖ్యంగా మాస్ సెంటర్ లలో… రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండతో “లైగర్” మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు నెలలో విడుదల అవటానికి సిద్ధంగా ఉంది. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో ఇంటర్నేషనల్ బాక్సర్ గా కనిపిస్తున్నాడు. అనన్య పాండ్య హీరోయిన్ గా నటిస్తోంది. వరస ఫ్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు.
కాగా ఈ సినిమా రిలీజ్ అవ్వకుండానే నెక్స్ట్ సినిమా జనగణమన స్టార్ట్ చేస్తున్నట్లు ఇండైరెక్ట్ గా చార్మి సోషల్ మీడియాలో పూరి ఆడియో పెట్టారు. లైగార్ సినిమా షూటింగ్ పూర్తయినట్లు తెలియజేసి “జనగణమన” స్టార్ట్ కానున్నట్లు ఆడియోలో పూరి ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చారు. గతంలోనే ఈ ప్రాజెక్ట్ గురించి పూరి మాట్లాడుతూ తన డ్రీం… ప్రాజెక్ట్ అని చెప్పుకొచ్చారు. మహేష్బాబుతో చేయాలని అనుకున్న కానీ ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరో నటించనున్నట్లు… దాదాపు విజయ్ దేవరకొండ అని టాక్ వస్తోంది.