ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే కాకుండా పాన్ ఇండియా హీరోగా మంచి పేరు సంపాదించుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ శుభవార్తను తెలియజేశాడు. ప్రభాస్ బాహుబలి చిత్రం తర్వాత పాన్ ఇండియా హీరోగా మంచి పేరు సంపాదించుకోవడంతో ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నట్లు గత ఏడాది ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు ఆ సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ లేవు.
నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తున్నారు.అంతేకాకుండా ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమితాబ్ బచ్చన్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన మరికొంత సమాచారాన్ని సంక్రాంతి కానుకగా తెలియజేస్తామని ఈ ఏడాది మొదట్లో నాగ్ అశ్విన్ ఓ సందర్భంలో తెలియజేశాడు. అయితే ఈ ఏడాది సంక్రాంతి పండుగ పూర్తయి దాదాపు పది రోజులు కావస్తున్నా ప్రభాస్ సినిమా గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో పెద్ద ఎత్తున నెటిజన్లు ఈ విషయంపై ట్వీట్స్ పెడుతున్నారు.
ఈ ట్వీట్ లపై స్పందించిన దర్శకుడు నాగ్ అశ్విన్ తాజాగా ఈ సినిమాకు సంబంధించి సమాచారం జనవరి 26న… లేదా ఫిబ్రవరి 26న కచ్చితంగా అప్డేట్ ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాధేశ్యామ్” చిత్రంలో నటిస్తున్నారు. దీని తర్వాత బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో “ఆది పురుష్”చిత్రం చేయనున్నాడు. ఇదే కాకుండా కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా “సలార్”సినిమాలో నటిస్తున్నట్లు మనకు తెలిసిందే.