కరోనా సమయంలో అసలైన ఆపద్బాంధవులు ఎవరో బయట పడ్డారు. చాలా మంది సినిమా హీరోలు తాము మేము అప్పుడు అలా చేసాము, ఇప్పుడు ఇలా చేసాము అంటూ తమ సినిమా విడుదలైన సమయంలో స్టేజి మీద రాక్షస సానుభూతి సంపాదించుకుని, అభిమానం క్యాష్ చేసుకున్న హీరోలు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్లంతా సమాజంలో ఏదో ఆదర్శవంతుడిగా తెగ గొప్పలు చెప్పుకునే రీతిలో వ్యవహరించగా అసలైన టైములో సహాయం చేయాల్సింది పోయి సైలెంట్ గా తేలిపోయారు.
మహమ్మారి కరోనా తీసుకొచ్చిన తిప్పల కు నోట్లోంచి మాట కూడా బయటకు వచ్చి చెప్పిన సందర్భాలు లేవు. కానీ నటుడు సోనూసూద్ మాత్రం కొన్ని వ్యవస్థలు, ప్రభుత్వాలు చేయాల్సిన పనులు తాను ఒక్కడిగా ప్రజలకు చేయడం జరిగింది. భగవంతుని దయతోనే తాను చేయగలిగినట్లు మీడియాకి తెలిపారు. పేదవాళ్లకు అదేవిధంగా లాక్ డౌన్ సమయంలో వలస కూలీలకు ఎన్నో రీతులుగా సహాయ కార్యక్రమాలు చేయడం జరిగింది. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న పేదవారికి సహాయం చేయడం కోసం టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
ఆర్థికంగానూ వస్తు రూపం లోనూ అనేక రీతులుగా పేదవాళ్లకు ఉపయోగపడుతూ ఉన్నారు. దీంతో చాలామందికి దేశవ్యాప్తంగా ఉన్న పేదవాళ్లకు సోనుసూద్ దేవుడు అయిపోయాడు. అలాంటి సోనూసూద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావటం అనేది చాలా గుడ్ న్యూస్ అని మీడియా వర్గాల్లో వార్తలు వస్తున్నాయి.
పూర్తి ఈ విషయం లోకి వెళితే ఇటీవల విజయనగరం జిల్లా సాలూరు గ్రామంలో గిరిజనులు సొంతంగా రోడ్డు వేసుకోవడం జరిగింది. గిరిజన ప్రజలంతా డబ్బులు పోగు చేసుకుని ఆరు లక్షల తో నాలుగు కిలోమీటర్ల మేర కొండ ప్రాంతంలో రోడ్డు వేసుకోవటం ఎంతో ఆ వీడియో ఒకటి సోషల్ మీడియాలో జర్నలిస్ట్ షేర్ చేయటం తో సోనుసూద్ ఇదంతా చూసి… త్వరలోనే ఆ గిరిజన ప్రజలను కలుస్తూనట్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోతున్నట్లు ట్విట్టర్లో స్పష్టం చేశారు.