ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మల్టీ స్టార్ సినిమాలు కుప్పలుతేప్పలుగా వస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు చాలావరకు మల్టీస్టారర్ సినిమాలకు పాన్ ఇండియా ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ “RRR” విడుదల కావడం తెలిసిందే. ఎన్టీఆర్, చరణ్ కలసి నటించిన ఈ సినిమా అనేక రికార్డులు సృష్టించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు నరసింహ నందమూరి బాలయ్య బాబు, రవితేజ కలిపి సినిమా చేయడానికి టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ రెడీ అయినట్లు టాక్. ఆదర్శకుడు మరెవరో కాదు గోపీచంద్ మలినేని.
రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని మూడు సినిమాలు తీసి హ్యాట్రిక్ విజయాలు సాధించడం జరిగింది. ప్రస్తుతం బాలయ్య బాబుతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. “NBK 107” వర్కింగ్ టైటిల్ పేరిట తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ నెలలో విడుదల కానుంది. ఇదంతా పక్కన పెడితే నందమూరి బాలయ్య బాబుకి సినిమా చేస్తున్న సమయంలో… రవితేజ తో కలిపి చేయబోయే మల్టీస్టారర్ ప్రాజెక్ట్ స్టోరీ వినిపించడం జరిగిందంట. దానికి బాలయ్య బాబు ఓకే చెప్పడం జరిగిందంట.
రవితేజ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు వార్తలు ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ప్రస్తుతం బాలయ్య బాబు చేస్తున్న సినిమాలో కూడా రవితేజ కి చిన్న పాత్ర డిజైన్ చేసినట్లు సమాచారం. ఆహా ఓటీటీలో బాలయ్య బాబు “అన్ స్టాపబుల్ షో” చేస్తున్న సమయంలో…. రవితేజ మరియు గోపీచంద్ మలినేని పాల్గొన్నారు. ఆ సమయంలో రవితేజ కి మరియు బాలయ్య మధ్య ఉన్న బాండింగ్ చూసి గోపీచంద్ మలినేని ఈ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీ టాక్.