Chiranjeevi : చిరంజీవి కోసం టాలీవుడ్ దర్శకులే కాదు పరభాషా దర్శకులు కూడా క్యూలో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తున్నారని కన్ఫర్మేషన్ ఇవ్వగానే దర్శకులందరు కథలు రెడీ చేసుకున్నారు. యంగ్ డైరెక్టర్స్ తో పాటు సీనియర్ దర్శకులు లైన్ లో ఉన్నారు. అలాగే పెద్ద నిర్మాతలు చిరంజీవి తో సినిమా చేయాలని బడ్జెట్ ఎంతైనా కేటాయించడానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలో చిరంజీవి వరసగా సినిమాలని చేసేందుకు క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టారు. చెప్పాలంటే యంగ్ హీరోలైనా సినిమా ఒకే చేసేందుకు కాస్త సమయం తీసుకుంటున్నారేమో గాని మెగాస్టార్ మాత్రం దూకుడు మీదున్నారు.
ఇప్పటికే ఆచార్య సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు మే 13 న డేట్ ని లాక్ చేసుకున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రాం చరణ్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళ సూపర్ హిట్ సినిమా తెలుగు రీమేక్ లో నటించబోతున్నాడు. ఈ నెలలోనే ఈ సినిమా సెట్స్ మీదకి వచ్చేందుకు షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని అన్ని అనుకున్నట్టుగా జరిగితే విజయదశమి పండుగ సందర్భంగా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా తర్వాత కూడా మరో సినిమాని సెట్స్ మీదకి తీసుకు వచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
Chiranjeevi : గోపీచంద్ మలినే దర్శకత్వం లో చిరంజీవి సినిమా ..?
ఇప్పటికే దర్శకుడు మెహర్ రమేష్ తమిళ సూపర్ హిట్ సినిమా వేదాళం తెలుగు రీమేక్ ని మెగాస్టార్ ఇమేజ్ కి తగ్గట్టుగా పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ సిద్దం చేసి రెడీగా ఉన్నాడు. మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే సెట్స్ మీదకి వచ్చేస్తాడు. ఇక మరో యంగ్ డైరెక్టర్ బాబీ కూడా మెగాస్టార్ పిలుపు కోసమే ఎదురు చూస్తున్నాడు. ఈ నాలుగు ప్రాజెక్ట్స్ అఫీషియల్ గా మెగాస్టార్ కమిటయినవి. ఇక తాజాగా క్రాక్ సినిమాతో సాలీడ్ హిట్ అందుకున్న దర్శకుడు గోపీచంద్ మలినేని తో సినిమా చేయడానికి మెగాస్టార్ ఒకే చెప్పినట్టు సమాచారం. ఈ నాలుగు ప్రాజెక్ట్స్ తర్వాత గోపీచంద్ మలినే దర్శకత్వం లో చిరంజీవి సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఇక చిరంజీవి కోసం భారీ యాక్షన్స్ ఎంటర్టైనర్ ని రెడీ చేస్తున్నట్టు సమాచారం.
Gopichand Malineni who prepared a huge action story for Chiranjeevi ..?