Veera Simha Reddy: నిన్న ఒంగోలులో జరిగిన “వీరసింహారెడ్డి” ప్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. బి గోపాల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకకు నందమూరి అభిమానులు భారీ ఎత్తున రావడం జరిగింది. అభిమానుల సమక్షంలో విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని మాట్లాడుతూ… బాలకృష్ణకి కోట్లల్లో అభిమానులు ఉన్నారు. ఆయన సినిమా సెట్ కి వస్తే ఓ అభిమానిగా దర్శకుడిగా గమనించాను. ఓ అభిమానిగా ఆయన నుంచి ఏది రాబట్టుకోవాలో… దాన్ని సినిమాలో చూపించడం జరిగింది. కోట్లల్లో అభిమానులు ఉన్నాగాని నాకు మాత్రమే సినిమా చేసే అవకాశం దక్కింది.
ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ జీవితానికి అంతకంటే ఏం కావాలి..?. ఒకప్పుడు బాలయ్య బాబు అభిమానిగా “సమరసింహారెడ్డి” సినిమాకి వెళ్లాను. ఇప్పుడు ఆయనను దర్శకత్వం చేసే స్థాయికి చేరుకున్నాను. జీవితానికి ఇంతకంటే ఏం కావాలి. ఇక హీరోయిన్ శృతిహాసన్ ఆమె నా లక్కీ హీరోయిన్. తన యాక్టింగ్ మరియు డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక మరో హీరోయిన్ హాని రోజ్ కూడా డాన్స్ బాగా వేసింది. భానుమతిగా వరలక్ష్మి శరత్ కుమార్ నటన … విలన్ పాత్రలో దునియా విజయ్ సినిమాకి హైలెట్ గా ఉంటాయి.
కచ్చితంగా “వీరసింహారెడ్డి” బ్లాక్ బస్టర్ అవుతుందన్న నమ్మకం.. బలంగా ఉంది అని దర్శకుడు గోపీచంద్ మలినేని తెలియజేయడం జరిగింది. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12వ తారీకు ఈ సినిమా విడుదల కానుంది. సినిమా ట్రైలర్. అంచనాలను మరింతగా పెంచేసింది. పైగా ట్రైలర్ లో ద్విపాత్రాభినయం.. బాలయ్య నటిస్తున్నట్లు కనిపించడం జరిగింది. ఫ్యాక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా బాలయ్య కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచిపోతుందని మేకర్స్ చెప్పుకొస్తున్నారు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!