Ramesh babu death: సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు అన్న ఘట్టమనేని రమేష్ బాబు శనివారం రాత్రి హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. గత కొంత కాలం నుంచీ కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడవగా.. నేడు ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.
జూబ్లీ హిల్స్లోని మహాప్రస్థానంలో నిర్వహించిన రమేష్ బాబు అంత్యక్రియల్లో ఘట్టమనేని కుటుంబసభ్యులు, పలువురు సినీ ప్రముఖులు పాల్గొని ఆయనకు తుది విడ్కోలు పలికారు. ఇక మహేష్ బాబుకు కరోనా సోకడంతో.. ఆయనెంతో ఇష్టపడే అన్నయ్యను చివరి చూపు కూడా చూసుకోలేకపోయారు. మరోవైపు మహేష్ బాబు పిల్లలు గౌతమ్, సితారలు పెదనాన్న రమేష్ బాబు చనిపోయాడని తెలీగానే.. ఎంతగానో కృంగిపోయారట. పెదనాన్న ఇకలేరు, రారు అని తెలుసుకుని వారిద్దరూ దుఃఖ సాగరంలో మునిగిపోయారని.. దాంతో గౌతమ్, సితారలను ఓదార్చడం చాలా కష్టమైందని తెలుస్తోంది.
కాగా, చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ను ప్రారంభించిన రమేష్ బాబు.. `సామ్రాట్` అనే సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత బజార్ రౌడీతో సూపర్ హిట్ను ఖాతాలో వేసుకున్న రమేష్ బాబు.. ఆపై కథల ఎంపికలో చేసిన పలు పొరపాట్ల వల్ల ఫేడవుట్ హీరోగా ముద్ర వేయించుకుని ఇండస్ట్రీకి దూరం అయ్యారు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!