“కార్తికేయ 2” సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. హీరో నిఖిల్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలో నిలిచింది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఈ సినిమాకి వస్తున్న కలెక్షన్లు ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యంతో ముంచేత్తుతున్నాయి. ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సినిమా కలెక్షన్ ల గురించి తన రాజకీయ సమావేశంలో ప్రస్తావించటం బట్టి చూస్తే “కార్తికేయ 2” ఎంతటి ఘన విజయం సాధించిందో చెప్పవచ్చు. ఈ క్రమంలో “కార్తికేయ 2” సినిమా యూనిట్ ని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర బాయ్ పటేల్ అభినందించారు. ఇంత మంచి సందేశాన్ని దేశానికి చూపినందుకు కృతజ్ఞతలు అంటూ.. ఆయనను కలిసిన హీరో నిఖిల్.. నిర్మాత అభిషేక్ నీ ప్రశంసించడం జరిగింది.
చందు మొండేటి దర్శకత్వం వహించిన “కార్తికేయ 2”.. దేశవ్యాప్తంగా దాదాపు 150 కోట్లకు పైగా కలెక్షన్ సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. తెలుగుతోపాటు హిందీలో విడుదలయ్యి ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది. ఉత్తరాది ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. ఇటీవల తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా అందరిని ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. మొన్న మధ్య “మేజర్” సూపర్ డూపర్ హిట్ అయిన క్రమంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సినిమా యూనిట్ మొత్తాన్ని అభినందించారు. ఇప్పుడు “కార్తికేయ 2” సినిమా టీం ని గుజరాత్ ముఖ్యమంత్రి అభినందించడం సంచలనం రేపుతోంది.
దక్షిణాది సినిమా రంగంలో తెరకెక్కి ముఖ్యంగా తెలుగులో విడుదలైన చిన్న హీరోల సినిమాలు నార్త్ ఇండియాలో రాణించటం అసాధారణం. శ్రీకృష్ణుడి నేపథ్యంలో విడుదలైన ఈ సినిమా ఫ్యామిలీ మరియు యూత్ నీ ఆకట్టుకోవడం జరిగింది. “కార్తికేయ 2” కి హిందీలో రోజురోజుకి ఆదరణ పెరుగుతూ ఉండటంతో థియేటర్ సంఖ్య కూడా పెంచుకుంటూ పోతున్నారు. సౌత్ నుండి బాలీవుడ్ లో విడుదలయ్య అత్యధిక వసులు దక్కించుకున్న టాప్ టెన్ జాబితాలో.. తాజాగా ఈ సినిమా 9వ స్థానం దక్కించుకోవడం విశేషం.