Hari Hara Veera Mallu: వకీల్ సాబ్, భీమ్లా నాయక్ చిత్రాలతో వరుస హిట్లను ఖాతాలో వేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ప్రముఖ స్టార్ డైరెక్టర్ క్రిష్ తో `హరి హర వీరమల్లు` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నిధి అగర్వాల్ ఇందులో హీరోయిన్గా నటిస్తుండగా.. అర్జున్ రాంపాల్, పూజిత పొన్నాడ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషిస్తున్నారు. 17వ శతాబ్దం నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్గా మారింది. అదేంటంటే.. ఈ సినిమా బడ్జెట్ మరింత పెరిగినట్టు వార్తలు వస్తున్నాయి. మొదట్లో ఈ సినిమాని రూ. 150 నుంచి రూ. 180 కోట్ల లోపు ప్లాన్ చెయ్యగా ఇప్పుడు అది కాస్త రూ. 200 కోట్లకి వెళ్లినట్టు జోరుగా టాక్ నడుస్తోంది.
ఈ సినిమాలో సెట్ వర్క్స్ మరియు గ్రాఫిక్స్ కే ఎక్కువగా ఖర్చు చేస్తున్నారని అంటున్నారు. ఏదేమైనా రూ. 200 కోట్ల బడ్జెట్ అంటే క్రిష్ రిస్క్ చేస్తున్నట్లే అవుతుంది. కాగా, ఈ మూవీ అనంతరం పవర్ హరీష్ శంకర్ డైరెక్షన్లో `భవదీయుడు భగత్ సింగ్` అనే సినిమా చేయనున్నాడు. అలాగే తమిళంలో హిట్ అయిన `వినోదాయ సీతం` రీమేక్ను సైతం పవన్ లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది.