డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ నుంచి ఒక సినిమా వస్తుందంటే కొబ్బరి కాయ కొట్టినప్పటి నుంచే ఆ సినిమా మీద అంచనాలు పీస్ లో ఉంటాయి. అంతగా పూరి మీద ఇండస్ట్రీ వర్గాలకి, ప్రేక్షకుల కి క్రేజ్ ఉంది. అంతేకాదు ఆయన దగ్గర పదేళ్ళకి సరిపడా కథ లు సిద్దంగా ఉన్నాయి. ఎప్పుడు ఏ కథ ని బయటకి తీస్తాడో ఏ హీరోతో చేస్తాడో అప్పటికప్పుడు డిసైడవుతుంది. కాని ఆయన డ్రీం ప్రాజెక్ట్ “జనగణమన” మాత్రం ఇంకా డైలమాలోనే ఉంది.
ఈ కథను కొన్నేళ్ళ క్రితమే రాసిపెట్టుకున్నారు పూరి… మహేష్ బాబు తప్ప మరెవరితోను చేయను అంటూ పూరి చాలా సందర్భాలలో చెప్పిన సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా ఈ కథ మహేష్ బాబు కోసమే రాశానని…ఎప్పటికైనా ఆయన తోనే తెరకెక్కిస్తానని పట్టుదలగా ఉన్నాడు. అయితే ఈ కథ మహేష్ బాబుకి నచ్చక పోవడం వల్లే నిర్మొహమాటంగా పూరి ఈ ప్రాజెక్ట్ వద్దని చెప్పినట్టు తెలుస్తుంది. కాని ఈ ఇద్దరి కాంబినేషన్ లో మాత్రం మరో సినిమా ఉంటుందని సమాచారం.
ఇక రీసెంట్ గా పూరి తన డ్రీం ప్రాజెక్ట్ జనగణమన ని త్వరలోనే మొదలు పెడతానంటూ వెల్లడించారు. అయితే ఈ ప్రాజెక్ట్ లో హీరో ఎవరు అన్నది క్లారిటి ఇవ్వలేదు. అయితే విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం పూరి జనగణమన ని కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో చేసారని తెలుస్తుంది. పూరి కి రజనీ అంటే విపరీతమైన పిచ్చి..అభిమానం. ఇప్పటికే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో సినిమా తీశారు పూరి. ఇక చిరంజీవి, రజనీకాంత్ లతో చేయాలన్నది పూరి కోరిక. చిరంజీవితో అనుకున్న ప్రాజెక్ట్ ఆగిపోగా మళ్ళీ అవకాశం వస్తే చిరు తో చేయడానికి సిద్దంగా ఉన్నాడు. ఇక రజనీకాంత్ తో డ్రీం ప్రాజెక్ట్ తీస్తే పూరి కోరిక తీరినట్టే. మరి ఆయన ఒప్పుకుంటారా లేదా చూడాలి.