Hebah patel: హెబ్బా పటేల్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `అధ్యక్ష` అని కన్నడ మూవీతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. `అలా ఎలా?` తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా గురించి పెద్దగా ఎవరికీ తెలీకపోయినా.. ఆ తర్వాత హెబ్బా చేసిన `కుమారి 21ఎఫ్` ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ 2015లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ముఖ్యంగా ఈ మూవీ ద్వారా హెబ్బా పటేల్కి యూత్లో సూపర్ క్రేజ్ దక్కింది. అయితే ఆ తర్వాత హెబ్బా వరుస పెట్టి సినిమాలు చేసినా ఆ స్థాయి హిట్ మాత్రం పడలేదు. ప్రస్తుతం అడపా తడపా సినిమాలు చేస్తున్న ఈ భామ.. అత్మహత్యకు సిద్ధమైంది.
అయితే రియల్గా కాదండోయ్.. రీల్గానే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హెబ్బా పటేల్ నటించిన తాజా చిత్రం `తెలిసిన వాళ్లు`. విప్లవ్ కోనేటి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ కార్తీక్ హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ మేకర్స్ విడుదల చేశారు.
ఇందులో మొదట హీరో, హీరోయిన్లు పరిచయం చేశారు. ఆ తర్వాత హెబ్బా పటేల్ను అత్మహత్యకు సిద్ధపడిన అమ్మాయిగా చూపించారు. `నన్ను నేను చంపుకోబోతున్నాను` అంటూ హెబ్బా పటేల్ డైలాగ్ చెప్పడం సినిమాపై ఆసక్తిని పెంచేసింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మరింత ఆకట్టుకుంది. మరి ఇంతకీ హీరోయిన్ ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంటోంది..? దాని వెనక కారణాలు ఏంటీ..? వంటి విషయాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.