బిగ్బాస్ నుండి తొలివారం ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన హేమ మంగళవారం హైదరాబాద్ ఫిలించాంబర్లో ప్రెస్మీట్ను నిర్వహించింది. ఇందులో బిగ్బాస్ హౌస్మేట్స్పై సంచలన వ్యాఖ్యలు చేసింది. హేమ మాట్లాడుతూ ..
రెండు, మూడు నెలలుగా చాలా సెన్సిటివ్ అయ్యాను. ఎవరైనా చిన్న మాట అంటే కూడా కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి. బయట కంటే దానికి బిగ్బాస్ హౌస్ బెటర్ అనిపించింది. నేను వేరే రంగంలోకి వెళ్లాలనుకుంటున్నాను. వాళ్లు వేసే కోడిగుడ్డు, టమాటాలు, చెప్పులు..ఏవైనా వేస్తే నన్ను నేను ఎలా కాపాడుకోగలుగుతాను అని తెలుసుకోవడానికే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లాను. నేనున్న కాసేపు నేను నటించలేదు. పిల్లల్ని బాగానే చూసుకున్నాను. బిగ్బాస్లో కంటెంట్ వారికి కనిపించలేదో… మరేదైనా కారణమో ఏమో కానీ.. వారికి హైలైట్ అయిన అంశాలను చూపించారు. నేను ఇంట్లోకి అడుగు పెట్టగానే, నాకు చాలా టాస్క్లు ఇచ్చారు. నాకు తెలిసిన దాన్ని బట్టే నేను నిర్ణయం తీసుకున్నాను. అక్కడి పరిస్థితులు అర్థం చేసుకునేలోపలే బయటకు వచ్చేశాను. నేను ఎవరినీ డామినేట్ చేయలేదు. మన ఇంట్లో పిల్లలకే మన కండీషన్స్ నచ్చవు. అలాంటిది బయట వారికి ఎలా నచ్చుతాయి. అందుకే నా హౌస్మేట్స్కు నేను నచ్చలేదు. వితికా తన భర్తకు ఇది కావాలంటూ, అది కావాలంటూ వంటింట్లోకి వచ్చేది. హిమజ గ్యాస్ స్టౌవ్పైనే వేడి నీళ్లు పెట్టుకునేది. చాలా విషయాలు జరిగాయి. కానీ నేను అరిచింది మాత్రమే చూపించారు“ అన్నారు.
ఆమె ఇంకా తన హౌస్ మేట్స్ గురించి మాట్లాడుతూ … వరుణ్ సందేశ్, శ్రీముఖి బాగా నటిస్తున్నారు. అలాగే శ్రీముఖి అందరి అటెన్షన్ పొండానికి ప్రయత్నిస్తుంది. అలాగే బాబా భాస్కర్ మాస్టర్ అందరితో మంచి అనిపించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. జర్నలిస్ట్ అయిన తాను కామెడీ చేస్తే బాగోదని జాఫర్ ప్రయత్నిస్తున్నారు. ఇంటా బయటా హిమజ మానిపులేట్ చేస్తుందని నేను చెబితే ఆ విషయంపైనే రాహుల్ చివరకు నామినేట్ అయ్యారు. అలీ బాగా ఆడుతున్నాడు. రోహిణి అందరినీ త్వరగా నమ్మేస్తుంది. సావిత్రి ఇంకా తన భర్త సెంటిమెంట్లోనే ఉంది. అంత ఒరిజినల్గాఉంటే బయటకు వచ్చేస్తారు. ఆషూ రెడ్డిలో ఇంకా మెచ్యూరిటీ రావాలి. వరుణ్ సందేశ్, మహేశ్ విషయంలో చాలా పెద్ద గొడవ జరిగితే తాను అరిచింది మాత్రమే చూపించారు“ అంటూ చెప్పారు హేమ.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!