Pakka Commercial: 2003వ సంవత్సరంలో సంక్రాంతి పండుగకు రిలీజ్ అయిన “ఒక్కడు”(Okkadu) సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు(Mahesh Babu) నటించిన ఈ సినిమా.. మహేష్ కెరియర్ లోనే మొట్టమొదటి బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది. అయితే ఈ సినిమాలో ప్రకాష్ రాజ్(Prakash Raj) నటించిన ఓబుల్ రెడ్డి పాత్ర.. గోపీచంద్(Gopichand) చేయాల్సింద అట. ఆ పాత్రని మొదట గుణశేఖర్(Guna Sekhar).. మొదట ప్రకాష్ రాజ్ నీ సంప్రదించగా ఆయన డేట్స్ కేటాయించకపోవడంతో.. ఆ తర్వాత గుణశేఖర్ ఆ పాత్ర గురించి గోపీచంద్ కి తెలిపారుట ఆయన ఓకే చేసినప్పటికీ.. అదే టైంలో ప్రకాష్ రాజ్ డేట్స్ సర్దుబాటు చేయడంతో.. “ఒక్కడు” సినిమా మిస్ అయినట్లు తాజాగా గోపీచంద్ తెలియజేశారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తలకెక్కిన “పక్కా కమర్షియల్”(Pakka Commercial) జులై 1న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు గోపీచంద్. ఈ క్రమంలో “ఒక్కడు”లో ఓబుల్ రెడ్డి విలన్ పాత్ర మిస్ అయినట్లు.. తెలియజేశారు. అంత మాత్రమే కాదు తన కెరీర్లో ఫస్ట్ హిట్ “యజ్ఞం”(Yaagnam) సినిమాకి మొదట నేను కాదు హీరో అంటూ గోపీచంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
“యజ్ఞం” స్టోరీని మొదట ప్రభాస్ కి వినిపించారు.. ఆయన రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ కి వినిపించారు ఆయన కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ టైంలో.. బాబాయ్ పోకూరి బాబురావు.. యజ్ఞం మూవీ లో హీరోగా నటిస్తావా అని నన్ను అడగగా వెంటనే ఓకే చేశాను అని సరికొత్త విషయాన్ని తెలిపారు. ఆ రీతిలో కళ్యాణ్ రామ్, ప్రభాస్ మిర్చి చేసుకున్న “యజ్ఞం” సినిమాతో తన కెరీర్ లో ఫస్ట్ హిట్ పడినట్లు గోపీచంద్ స్పష్టం చేశారు.