Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) సక్సెస్ఫుల్ జర్నీతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. దాదాపు నాలుగు సంవత్సరాల నుండి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ టాలీవుడ్(Tollywood) బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. పాండమిక్ రాకముందు 3 బ్లాక్ బస్టర్ విజయాలు తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. ఇక పాండమిక్ తర్వాత కూడా “సర్కారు వారి పాట”(Sarkaru Vaari Pata)తో మరో విజయాన్ని అందుకున్న మహేష్ బాబు.. ప్రస్తుతం ఫ్యామిలీతో యూరప్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ క్రమంలో అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. దీనిలో భాగంగా తాజాగా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరున్న బిల్ గేట్స్ తో మహేష్ బాబు మరియు నమ్రత ఫోటో దిగటం జరిగింది. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. అత్యంత విజనరీ మరియు.. ఆదర్శవంతమైన వ్యక్తి బిల్ గేట్స్(BillGates) తో సమావేశం కావటం సంతోషం..అంటూ మహేష్ .. నమ్రత(Namrata Shirrodkar)బిల్ గేట్స్ తో దిగిన ఫోటో పోస్ట్ చేయటంతో.. ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న మహేష్… ఇండియాకి వచ్చిన వెంటనే త్రివిక్రమ్ సినిమా.. స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. తక్కువ టైమ్ లో సినిమా కంప్లీట్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు విడుదల చేసే ప్లాన్ చేస్తున్నారు. త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో మహేష్ దాదాపు పదకొండు సంవత్సరాల తర్వాత సినిమా చూస్తూ ఉండటంతోపాటు..వీరిద్దరి కాంబినేషన్ లో మూడో సినిమా కావటంతో.. అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. త్రివిక్రమ్ కూడా మహేష్ బాబుని ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా చూపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.