హీరో నాగ శౌర్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. “ఊహలు గుసగుసలాడే” సినిమాతో మొదటి హిట్ అందుకున్న నాగశౌర్య అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో సినిమాలు చేస్తూ తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. ప్రతి పాత్రలో పరకాయ ప్రవేశం చేసే రీతిలో చాలా కష్టపడుతూ.. సినిమా విజయం సాధించడం కోసం ఎంతటికైనా రెడీ అయ్యే హీరో. నాగశౌర్యతో సినిమాలు చేయడానికి చాలామంది దర్శకులు ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే దర్శకుడు చెప్పింది తూచా చేస్తూ.. తన బెస్ట్ ఇవ్వడానికి శౌర్య ఎంతగానో ప్రాయాస పడుతూ ఉంటాడు.
#NS22: నాగశౌర్య 22వ చిత్ర షూటింగ్ పోస్టర్ వైరల్..!!
అటువంటి నాగశౌర్య ఇప్పుడు పాదయాత్ర చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో తన కొత్త సినిమా “కృష్ణ వ్రింద విహారి” ఈనెల 23వ తారీకు విడుదలవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల కోసం పాదయాత్ర ప్లాన్ చేయడం జరిగిందట. హీరో నాగశౌర్యతో పాటు సినిమా యూనిట్ సెప్టెంబర్ 14వ తారీకు తిరుపతి, 15వ తారీకు నెల్లూరు, ఒంగోలు, 16వ తారీకు విజయవాడ, గుంటూరు, ఏలూరు. 17వ తారీకు భీమవరం, రాజమండ్రి. 18 వ తారీకు కాకినాడ ఇంకా విశాఖపట్నం నగరాలలో నాగశౌర్య పాదయాత్ర చేయనున్నారు. ఈ పాదయాత్రకి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సినిమా యూనిట్ చేసినట్లు సమాచారం.
మూడు రోజుల క్రితం సినిమాకి సంబంధించి విడుదలైన ట్రైలర్.. ఎంతగానో ఆకట్టుకుంది. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా డైరెక్టర్ అనీష్ ఆర్ కృష్ణ తెరకెక్కించారు. నాగశౌర్య సొంత బ్యానర్ లోనే ఈ సినిమా నిర్మాణం జరిగింది. సనాతన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడిగా నాగశౌర్య నటించడం జరిగింది. సినిమాలో బ్రహ్మాజీ రాధిక సత్య వెన్నెల కిషోర్ రాహుల్ రామకృష్ణ వంటి నటీనటులు కీలకపాత్రలు పోషించారు. షేర్లి సేటియా హీరోయిన్ గా నటిస్తోంది.