Nikhil:ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రచ్చ గురించి అందరికీ విదితమే. అదే సినిమా టిక్కెట్ల వ్యవహారం.
కోవిడ్ 2nd వేవ్ తర్వాత సినిమా థియేటర్స్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది. జనాలు వస్తారో రారో అన్న పరిస్థితి నెలకొంది. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ జనాలు థియేటర్ కి రావడంతో సినీ పెద్దలు ఊపిరి పిల్చుకున్నారు. అయితే వారి ఆనందం ఎంతో సేపు నిలవనియ్యలేదు ఏపీ ప్రభుత్వం. అవును.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్స్ను తగ్గిస్తూ జీవోను జారీ చేయడం అనేది తెలుగు ఇండస్ట్రీకి పెద్ద దెబ్బ అనే చెప్పుకోవాలి.
Maa Associatation: “మా” అసోసియేషన్ పై నటుడు సాయి కుమార్ సంచలన కామెంట్స్..!!
సినీ ప్రముఖల రియాక్షన్ ఏమిటి?
కరోనా కష్టకాలం తరువాత సినీ పరిశ్రమ బాగా డీలా పడిపోయిన విషయం తెలిసినదే. ఇక దానినుండి మెల్లగా కోలుకునే ప్రయత్నం చేస్తుండగా ఏపీ ప్రభుత్వం మళ్ళీ చావు దెబ్బ కొట్టినంత పని చేస్తోంది. ఇక ఈ విషయం మీద పలువురు సినీ ప్రముఖులు ఇప్పుడిప్పుడే స్పందిస్తున్నారు. అందులో ముందు వరుసలో ఉండేది మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే చెప్పుకోవాలి. అతని తరువాత మొన్న హీరో నాని ఈ విషయం మీద గట్టిగానే స్పందించారు. ఏపీ ప్రభుత్వం సినిమా ప్రేక్షకులను అవమానిస్తోంది అని ఆరోపించారు.
Maa Associatation: “మా” అసోసియేషన్ పై నటుడు సాయి కుమార్ సంచలన కామెంట్స్..!!
సినిమా హీరో నిఖిల్ స్పందన ఏమిటి?
తాజాగా హీరో నిఖిల్ ట్విట్టర్ వేదిగా ఈ విషయమై స్పందించారు. తెలుగు సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సపోర్ట్ గురించి మంచిగా స్పందించారు. అదే మాదిరి ఏపీ ప్రభుత్వం కూడా మంచి చర్యలు తీసుకోవాలని అన్నారు. అన్నీ వర్గాల ప్రేక్షకులకు అందుబాటులో ధరల్లోనే థియేటర్స్ ఉన్నాయి అని అన్నారు. ఇక ట్రెయిన్లో వివిధ తరగతులకు చెందిన కంపార్ట్మెంట్స్ వున్నట్టే థియేటర్లోని బాల్కనీ, ప్రీమియమ్ సెక్షన్ వుంటాయని, అందువలన కాస్త టికెట్ ధరను పెంచాలని ఈ సందర్భంగా సూచించారు.