నితిన్ `ఛల్ మోహన్రంగ` సినిమా తర్వాత `భీష్మ` సినిమాను స్టార్ట్ చేయడానికి చాలా గ్యాపే తీసుకున్నాడు. అయితే భీష్మతో సహా మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆదివారం చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. కాగా.. ఈరోజు మరో సినిమా టైటిల్ను అనౌన్స్ చేశారు. `తొలిప్రేమ` ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా ఈ సినిమా రూపొందనుంది. నితిన్ సరసన కీర్తిసురేశ్ హీరోయిన్గా నటించనుంది. ఈ చిత్రానికి `రంగ్ దే` అనే టైటిల్ను నిర్ణయించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. అంటే ఇప్పుడు నితిన్ మూడు సినిమాలను ఒకేసారి ట్రాక్లో ఎక్కిస్తాడన్నమాట. ఈ చిత్రానికి పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
previous post
next post