Hero Ram: `ఇస్మార్ట్ శంకర్` హిట్ తర్వాత ఫుల్ ఫామ్లోకి వచ్చిన టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. తాజాగా ఫ్యాన్స్కి సూపర్ కిక్కిచ్చే న్యూస్ చెప్పాడు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. గత కొద్ది రోజుల నుంచీ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో రామ్ సినిమా చేయబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
కానీ, ఎలాంటి అధిక ప్రకటన లేకపోవడం వల్ల ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలీక రామ్ ఫ్యాన్స్ తీవ్ర అయోమయంలో పడ్డారు. అయితే తాజాగా రామ్ తన 20వ సినిమాను బోయపాటి శ్రీనుతో చేయబోతున్నట్లు అఫీషల్గా అనౌన్స్ చేశాడు. ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు.
ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించిన రామ్.. దర్శక నిర్మాతలతో దిగిన ఓ ఫొటోను కూడా షేర్ చేశాడు. మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి. ఇక ఈ అప్డేట్తో రామ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. కాగా, రామ్ ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామితో `ది వారియర్` అనే మూవీ చేస్తున్నాడు.
కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలోనూ రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో ఆది పిని శెట్టి విలన్గా నటిస్తుండగా.. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా రామ్ కనిపించబోతున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సమ్మర్ తర్వాత విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Super kicked to announce my 20th film! #RAPO20 is #BoyapatiRapo !!
Excited to see myself through the eyes of the Daddy of Mass emotions Boyapati garu.🤘
Love..#RAPO pic.twitter.com/J5cFVxU7nv
— RAm POthineni (@ramsayz) February 18, 2022