రామ్ పోతినేని ఇటీవల “వారియర్” సినిమాతో పరాజయం ఎదుర్కోవటం తెలిసిందే. లింగు స్వామి దర్శకత్వంలో తెరకెక్కిన “వారియర్” ఏమాత్రం ఆకట్టుకోలేదు. దీంతో ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో చేయబోయే ప్రాజెక్టుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం ఏకంగా కెరియర్ లో ఎన్నడూ లేని రీతిలో 11 కేజీలు పెరగడానికి రామ్ డిసైడ్ అయినట్లు ఇండస్ట్రీ టాక్. ఈ సినిమాలో డబల్ రోల్ లో రామ్ కనిపించనున్నారట. కథ డిమాండ్ చేయటంతో … పాత్రలో వేరియేషన్ కోసం బరువు పెరిగే విషయంపై రామ్ దృష్టి సారించినట్లు సమాచారం.
త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. రామ్ కెరియర్ లోనే అత్యంత హైయెస్ట్ భారీ బడ్జెట్ చిత్రంగా బోయపాటి డిజైన్ చేయడం జరిగింది. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్ తో “వినయ విధేయ రామ” తెరకెక్కించి బోయపాటి దారుణమైన ప్లాప్ ఖాతాలో వేసుకోవడం జరిగింది. ఈ సినిమా తర్వాత డైరెక్షన్ పరంగా అనేక నెగటివ్ కామెంట్ లు వచ్చాయి.
అయితే గత ఏడాది “అఖండ” సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకుని బోయపాటి మళ్లీ ఫామ్ లోకి రావడం జరిగింది. “అఖండ” తో బాలయ్యతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవటం జరిగింది. దీంతో రామ్ పోతినేని సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్రవంతి మూవీస్ బ్యానర్ ఈ సినిమాని నిర్మిస్తూ ఉంది. రామ్ పాత్రని చాలా పవర్ ఫుల్ గా బోయపాటి డిజైన్ చేసినట్లు సమాచారం. రెండు పాత్రలలో కూడా చాలా విభిన్నంగా చూపించనున్నట్లు అందులో ఒకటి బాలకృష్ణ అభిమానిగా రామ్ కనిపించనున్నట్లు టాక్.