venkatesh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం `భీమ్లా నాయక్`. మలయాళంలో హిట్టైన `అయ్యప్పనుమ్ కోషియుమ్`కు రీమేక్ ఇది. సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించారు. నిత్యా మీనన్, సంయుక్త హీనన్ హీరోయిన్లుగా నటించగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు.
ఇటీవలె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 25న అట్టహాసంగా విడుదల కాబోతోంది. ప్రమోషన్స్లో భాగంగా మేకర్స్ నిన్న `భీమ్లానాయక్` ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను హైదరాబాద్లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్లో గ్రాంగా నిర్వహించి.. సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యేలా చేశారు.
ఇక మరి కొద్ది గంటల్లో రిలీజ్ అనగా.. విక్టరీ వెంకటేష్ `భీమ్లా నాయక్`పై ఆసక్తికర ట్వీట్ చేశాడు. `భీమ్లా నాయక్ రిలీజ్ పై చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాను. ఎప్పుడెప్పుడు థియేటర్లకు వస్తుందా అని ఎంతో అతృతగా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమా నుంచి వదిలిన ప్రోమోలు .. ట్రైలర్లు ఫెంటాస్టిక్ గా వచ్చాయి.
ఈ సినిమాతో పవన్, రానాలిద్దరూ కూడా బ్లాక్ బస్టర్ హిట్ను ఖచ్చితంగా అందుకుంటారు` అంటూ వెంకీ తన ట్విట్టర్ పోస్ట్లో రాసుకొచ్చారు. ఫ్యాన్స్కి మరింత బూస్ట్ ఇచ్చిన వెంకీ ట్వీట్ ప్రస్తుతం వైరల్గా మారింది. మరి ఈయన చెప్పినట్లు `భీమ్లా నాయక్` చిత్రం హిట్ అవుతుందో..? లేదా..? చూడాలి.