Venkatesh: ప్రముఖ సినీ నటుడు విక్టరీ వెంకటేష్ నంది అవార్డుల ప్రధానోత్సవం పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నంది అవార్డులపై ప్రధానోత్సవం పై తెగ చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో రాష్ట్ర విభజన జరగక ముందు నంది అవార్డుల ప్రధానోత్సవం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగేది. రాష్ట్రం విడిపోయాక 2016 వరకు కూడా జరిగింది. కానీ ఆ తర్వాత నుంచి నంది అవార్డుల కార్యక్రమం ఆగిపోయింది. ఈ క్రమంలో ఇటీవల నంది అవార్డుల వ్యవహారంపై మాటలు యుద్ధమే జరుగుతుంది. ఒకప్పుడు ప్రభుత్వాలు ఇచ్చే ఈ అవార్డులకు ఎంతో విలువ ఉండేదని ఇప్పుడు విలువ లేకుండా పోయిందని కొంతమంది ఇటీవల ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కామెంట్లు చేయడం జరిగింది.
అవి రాజకీయ విమర్శలకు దారితీసి అనేక పొలిటికల్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఇటువంటి పరిస్థితులలో విక్టరీ వెంకటేష్ ఈ నంది అవార్డుల విషయంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మేటర్ లోకి వెళ్తే ఇటీవల డైరెక్టర్ తేజ దర్శకత్వంలో దగ్గుబాటి అభిరామ్ కథానాయకుడిగా పరిచయమవుతున్న “అహింస” సినిమా ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్ నంది అవార్డుల గురించి మాట్లాడుతూ… తాను ఎలాంటి అవార్డుల గురించి ఆలోచించడం లేదని స్పష్టం చేశారు. అవార్డులు ఇస్తే ఇవ్వొచ్చు లేదంటే లేదు అని పేర్కొన్నారు.
కానీ సినిమా పరిశ్రమలకు అవార్డులు ఇస్తే మాత్రం అవి తమకు ఉత్సాహాన్ని కలిగిస్తాయని స్పష్టం చేశారు. పరోక్షంగా ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వడం వల్ల సినిమా పరిశ్రమకు ప్రోత్సాహాన్ని కల్పించినట్లు అవుతుందని వెంకటేష్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ఇదే రీతిలో సినిమా ఇండస్ట్రీకి చెందిన మిగతా హీరోలు… సినిమా ప్రముఖులు కూడా ముందుకొచ్చి నంది అవార్డుల ప్రధానోత్సవం పై తమ అభిప్రాయాన్ని తెలియజేస్తే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గతంలో మాదిరిగా.. నంది అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాలు చేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!