విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన `దొరసాని` చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వేడుకకి విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినిమా గురించి, ఫ్యామిలీ గురించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ స్టేజ్పైనే ఎమోషనల్ అయిపోయి ఏడ్చేశాడు. ఆనంద్ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్గా పనిచేసేవాడని, తను ఇంటికి డబ్బు పంపేవాడని, ఆ సమయంలో తాను సెటిల్ కాలేదని, కుటుంబం కోసం ఆనంద్ త్యాగం చేశాడని చెప్పుకొచ్చాడు విజయ్. `ఓరోజు ఆనంద్ సడెన్గా ఫోన్ చేసి ఉద్యోగం మానేసి ఇంటికొచ్చేస్తానని చెప్పాడట, అది నాకు నచ్చలేదు. ఎందుకంటే తను ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగం. కానీ తను అప్పటికే ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. ఇక సరేఅన్నాను. తను ఇక్కడకు వచ్చిన తర్వాత తన సొంత ఖర్చుతో చాలా రకాల ట్రైనింగ్స్ తీసుకుని నటుడిగా మారాడు` అని తెలిపారు విజయ్ దేవరకొండ.
previous post
next post