హీరో విశాల్ అందరికీ సుపరిచితుడే. తెలుగు, తమిళం భాషల్లో మంచి క్రేజ్ ఉన్న విశాల్.. నటుడిగా మాత్రమే కాదు మంచి మనిషిగా కూడా ఎన్నో సహాయ కార్యక్రమాలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. కొద్ది నెలల క్రితం కన్నడ ఇండస్ట్రీ పవర్ స్టార్ పుష్పరాజ్ మరణించిన సమయంలో ఆయన సొంత డబ్బులతో చదివించే అనాధ పిల్లలను… విశాల్ దత్తత తీసుకోవడం తెలిసిందే. ముఖ్యంగా నడిగర్ సంఘం అధ్యక్షుడిగా విశాల్ తీసుకునే చాలా నిర్ణయాలు హైలెట్ అవుతూ ఉంటాయి.
దీనిలో భాగంగానే తాజాగా నడిగర్ భవనం కట్టే వరకు తాను పెళ్లి చేసుకోనని గతంలో శపథం చేయడం తెలిసిందే. ఇదిలా ఉంటే హీరో విశాల్ త్వరలో తా ను పెళ్లి చేసుకోబోతున్నట్లు స్పష్టం చేశారు. అంత మాత్రమే కాదు ప్రస్తుతం తాను ప్రేమలో ఉన్నానని కూడా క్లారిటీ ఇచ్చా రు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విశల్… పెద్దలు కుదిరిచిన వివాహాలు తనకి కలిసి రావండి కాబట్టి ప్రేమ పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. గతంలో 2019వ సంవత్సరంలో నటి అనీషా అల్లారెడ్డితో నిశ్చితార్థం జరిగింది.
ఇక పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అనుకునేలోపు వారు నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత వరలక్ష్మి శరత్ కుమార్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి కానీ ఇద్దరం స్నేహితులని విశాల్ తెలియజేశారు. అయితే ప్రస్తుతం ప్రేమలో ఉన్నానని త్వరలో ఆమె ఎవరో తెలియజేస్తాను, ప్రేమ పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ విశాల్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో కామెంట్ చేయడం వైరల్ గా మారింది. ప్రస్తుతం విశాల్ “లాఠీ” అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో విశాల్ గాయాలు పాలు కావడం జరిగింది. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!