చాలామంది హీరోయిన్ మాదిరిగా గ్లామర్ లుక్ లో కాకుండా, ఎంతో సాంప్రదాయ పద్ధతులలో సినిమాలలో నటించిన కళ్యాణి, కథానాయికగా చాలా సినిమాల్లోనే నటించింది. ఎంతో హుందాగా కనిపించే కళ్యాణి కుటుంబ కథా చిత్రాలలో నటించి అందరి ప్రశంసలు పొందింది. అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, పెదబాబు, వసంతం లాంటి హిట్ సినిమాలను తీసే ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.
కళ్యాణి దర్శకుడు సూర్య కిరణ్ ను పెళ్లి చేసుకున్నాక కథానాయక పాత్రలలో నటించలేదు. కేవలం వదిన, అక్క వంటి అడపాదడపా పాత్రలలో నటిస్తూ కనిపించింది. అయితే తన భర్త సూర్య కిరణ్ నుంచి విడిపోయి విడాకులు తీసుకున్న కళ్యాణి ప్రస్తుతం ఒక పెద్ద సాహసం చేయాలనే నిర్ణయం తీసుకుంది. ఆమె స్వీయ దర్శకత్వంలో ఓ సినిమాను నిర్మిస్తున్నారు.
కే2కే పిక్చర్స్ పేరుతో సొంత బ్యానర్ ని పెట్టి ఆమె సొంతంగా కథను తయారు చేసుకుని, తానే దర్శకురాలిగా ఓ సినిమా నిర్మించనున్నట్లు సినీ వర్గాల సమాచారం. ఈ సినిమా కథానాయకుడి పాత్రలో రాజుగారిగది సినిమాలో నటించిన చేతన్ చీను నీ ఇందులో కథానాయకుడిగా ఎంపిక చేసింది. ఈ సినిమాను మొదట తెలుగులో చిత్రీకరించాలని నిర్ణయించుకున్న కళ్యాణి, లాక్ డౌన్ సమయంలో స్క్రిప్టు మల్టీ లాంగ్వేజెస్ లో డెవలప్ చేసి, వివిధ భాషలలో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన పాటలను ప్రముఖ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్ర బోస్, భాస్కరభట్ల మొదలైన ప్రముఖులతో పాటలను కూడా రాయించిన కళ్యాణి ఈ సినిమాకు అచ్చు రాజమణిని సంగీత దర్శకునిగా ఎంచుకున్నారు. ఈ సినిమా గురించి పలువురు స్పందించి, కాస్త పేరున్న హీరోను పెట్టుకొని ఇలాంటి సాహసాలు చేస్తే బాగుండేదని, సొంత డబ్బులతో కళ్యాణి పెద్ద సాహసమే చేస్తున్నారని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.