పనిచేయాలనే ఉత్సాహం మనలో ఉండాలేగానీ, ఇవాళ్టి రోజున ఫేడ్ ఔట్ అనేది అస్సలు ఉండదు. నీ ఓపిక, నీ తీరిక, నీ పని… అన్నట్టుంది ఇండస్ట్రీ. ప్రియమణిలాంటివారు దానికి చక్కటి ఉదాహరణగా కూడా ఉంటున్నారు. తెలుగింటి కోడలు సమంత పెళ్లి తర్వాత వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు . సేమ్ వే కన్నడ హుడుగి ప్రియమణి కూడా క్షణం తీరిక లేకుండా కాల్షీట్లు కేటాయిస్తున్నారు. ఆల్రెడీ తెలుగులో `సిరివెన్నెల` చిత్రంలో నటిస్తున్నా ఆమె తాజాగా `విరాట పర్వం`లో నటిస్తున్నట్టు సమాచారం. ఇందులో రానా కథానాయకుడు. సాయిపల్లవి నాయిక. ఎమెర్జన్సీ సమయంలో జరిగిన కథతను వేణు ఊడుగుల `విరాట పర్వం` పేరుతో తెరకెక్కించనున్నారు. టబు ఇందులో అతి ముఖ్యమైన పాత్రలో నటించనున్నారు. ఆమె మానవ హక్కుల అధికారిగా కనిపిస్తారు. ఇందులో అంతే ఇంపార్టెన్స్ ఉన్న మరో పాత్ర ఉండనుంది. ఈ పాత్ర కోసమే ప్రియమణి సైన్ చేశారని వినికిడి. కన్నడలోనూ ప్రియమణి చేతిలో `నన్న ప్రకార`, `డాక్టర్ 56` అని రెండు సినిమాలున్నాయి.
previous post
next post
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!