Rashmika Mandanna: కన్నడ బ్యూటీ రష్మిక మందన “పుష్ప” సినిమాతో దేశవ్యాప్తంగా వరుస అవకాశాలు అందుకుంటుంది. కన్నడ ఇండస్ట్రీ నుండి తెలుగులో “చలో” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ… అతి తక్కువ కాలంలోనే తిరుగులేని హీరోయిన్ ఇమేజ్ సొంతం చేసుకుంది. చలో సినిమా తర్వాత “గీత గోవిందం”, “డియర్ కామ్రేడ్” సినిమాలతో విజయం అందుకున్న ఈ ముద్దుగుమ్మ వెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబుతో “సరిలేరు నీకు ఎవరు” సినిమా చూసి మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకోంది.
అనంతరం సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ బన్నీ నటించిన “పుష్ప” తో అరాచకం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఉన్నా కొద్ది పాపులర్ అవుతున్న రష్మిక నీ సోషల్ మీడియాలో చాలామంది టార్గెట్ చేసుకునీ విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో తనని విమర్శించే వారికి సోషల్ మీడియాలో కౌంటర్ ఇచ్చేలా పోస్ట్ పెట్టింది. “గత కొంతకాలంగా నన్ను చాలామంది విమర్శలు ఇంక నెగటివ్ కామెంట్లతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నేను అందరికీ నచ్చాల్సిన పనిలేదు.
నేను మీకు నచ్చలేదంటే దానర్థం… విమర్శలు చేయొచ్చని కాదు. మిమ్మల్ని సంతోష పెట్టడానికి ఎంత కష్టపడతానో… నాకు తెలుసు. నేను మాట్లాడని విషయాలపై కూడా నన్ను విమర్శిస్తుంటే.. గుండె పగిలినట్టు ఉంటుంది” అని రష్మిక మందన పోస్ట్ పెట్టడం జరిగింది. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం రష్మిక మందన పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ లో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి త్వరగా కంప్లీట్ చేసి.. విడుదల చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉంది.