Rashmika Mandana: ప్రపంచంలో అన్ని దేశాల్లో కల్లా కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఇండియాలో అధికంగా ఉన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ రెండో వారం నుండి జూన్ ప్రారంభం వరకు ఇండియాలో కరోనా విలయతాండవం సృష్టించింది. చాలామంది సెలబ్రిటీలు సామాన్యులు కరోనా బారిన పడ్డారు. భయంకరంగా ఈ మహమ్మారి విజృంభించింది. ఎక్కడ చూసినా మరణాలు, కేసులు అదేరీతిలో ఆక్సిజన్ లేక ఆర్తనాదాలు. ఇటువంటి వార్తలు గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తూ ఉన్నాయి.
కరోనా కారణంగా తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు అదేవిధంగా భర్తను కోల్పోయిన భార్యలు ఇలా అనేక రకాలుగా ఈ కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం సృష్టించింది. ఇటువంటి తరుణంలో తాజాగా రష్మిక మందన ఈ మహమ్మారి సృష్టించిన విలయతాండవనికి బెంబేలెత్తిన నిర్ణయం తీసుకోవడం జరిగింది. విషయంలోకి వెళితే ఇక పూర్తిగా సోషల్ మీడియా కి దూరం కావాలని రష్మిక మందన మరియు ఆమె టీం నిర్ణయించుకున్నట్లు లేటెస్ట్ టాక్.
Read More: Rashmika Mandana : అభిమానులను స్వీటుగా తిట్టినా రష్మిక మందన..!!
ఈ మహామారి సృష్టించిన విలయతాండవం మనశ్శాంతి లేకుండా చేసింది కొద్దిరోజులపాటు సోషల్ మీడియా కి దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లు రష్మిక మందన తాజాగా చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే లాక్డౌన్ సమయంలో సినిమాలు రాణి క్రమంలో రష్మిక మందన సోషల్ మీడియాలో… అనేక విషయాలు ఫోటోలు అప్లోడ్ చేస్తూ చిట్చాట్ రూపంలో చాటింగ్ చేస్తూ వీడియో రూపంలో అభిమానులతో ముచ్చటించడం జరిగింది. అయితే ఒక్కసారిగా ఆమె సోషల్ మీడియా కి దూరం అవ్వాలని తాజాగా డిసైడ్ అవ్వటంతో ఇది నిజంగా రష్మిక అభిమానులకు పెద్ద దెబ్బ అని సినీ విశ్లేషకులు అంటున్నారు.