“పుష్ప” సినిమాతో దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పాపులారిటీ పెంచేసుకుంది కన్నడ భామ రష్మిక మందన. తెలుగులో చలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ముఖ్యంగా “గీతాగోవిందం” సినిమా విజయంతో రష్మిక మందన కి తిరుగులేని క్రేజ్ ఏర్పడింది. అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబుతో “సరిలేరు నీకేవరు” సినిమా ఛాన్స్ అందుకుని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో “పుష్ప”లో ఓవరాల్ ఇండియాలో మంచి హిట్ అందుకోవటం తెలిసిందే. పుష్ప సినిమాతో రష్మిక మందన క్రేజ్ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.
ప్రస్తుతం దక్షిణాదిలో సినిమాలు చేస్తూనే మరో పక్క బాలీవుడ్ లో కూడా అనేక అవకాశాలు అందుకుంటూ ఉంది. త్వరలో “పుష్ప” సెకండ్ పార్ట్ షూటింగ్ లో జాయిన్ కానుంది. ఇటువంటి తరుణంలో అభిమానులకు రష్మిక మందన జాగ్రత్తలు తెలియజేయడం జరిగింది. విషయంలోకి వెళ్తే ప్రస్తుతం చేసే వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో వర్షాల కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయనీ, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని కోరింది.
పనులు పూర్తి చేసుకుని తిరిగి ఇళ్ళకు చేరుకునే సమయంలో… ప్లీజ్…జాగ్రత్తగా ఉండి సురక్షితంగా ఇళ్లకు చేరాలని సూచిస్తూ..ట్వీట్ చేసింది. తమ అభిమాన హీరోయిన్ ఈ రకంగా జాగ్రత్త చెప్పటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇదిలా ఉంటే రష్మిక మందన తెలుగులో మరికొన్ని కీలక ప్రాజెక్టులు చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మహేష్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి టాప్ హీరోల సరసన నటించిన ఈ కన్నడ భామ త్వరలో తెలుగులో మరింత టాప్ హీరోల సినిమాలలో నటించనున్నట్లు సమాచారం.