Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “పుష్ప 2” కోసం మొత్తం సినిమా ప్రపంచం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. “పుష్ప” మొదటి భాగం గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలయ్యి ఊహించని విజయం సాధించింది. యావత్ సినిమా ప్రపంచాన్ని సెలబ్రిటీలను రాజకీయ నాయకులను ఈ సినిమాలో డైలాగులు ఒక ఊపు ఊప్పేశాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క ప్రమోషన్ కార్యక్రమం సరిగ్గా చేయకపోయినా గాని అక్కడ ₹100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అందరికీ మతులు పోగొట్టింది. ఇంతటి ఘన విజయం సాధించటంతో ఇప్పుడు రెండో భాగం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో ఇటీవల “పుష్ప 2” షూటింగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి హీరోయిన్ గా రష్మిక మందననీ పక్కన పెట్టే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే “కాంతారా” సినిమాపై రష్మిక చేసిన వ్యాఖ్యలు కారణంగా ఆమెను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేసినట్లు ప్రచారం జరిగింది. ఆమె కన్నడ ఇండస్ట్రీకి చెందిన గాని.. అందరి అభిమానం సొంతం చేసుకున్న “కాంతారా” పై చేసిన కాంట్రవర్సీ కామెంట్లు కారణంగా… రష్మికపై కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ విధించిందట.
ఈ పరిణామంతో “పుష్ప 2” లో రష్మిక హీరోయిన్ కావడంతో ఈ సినిమా అక్కడ ఆడే అవకాశాలు… లేకపోయే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో సినిమా యూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. అయితే రష్మిక స్థానంలో సాయి పల్లవినీ తీసుకునే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయానికి సంబంధించి సినిమా యూనిట్ నుండి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే “పుష్ప” మొదటి భాగం కంటే మరీ ఎక్కువగా సెకండ్ భాగం అత్యధికమైన భాషలలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ క్రియేట్ కావడంతో “పుష్ప 2″నీ బన్నీ చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగిందంట. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది.