`హుషారు`తో బాక్సాఫీస్ దగ్గర లాభాల బాటలో నడిచిన దర్శకుడు శ్రీహర్ష కోనుగంటి. ఇప్పుడు ఈ దర్శకుడు దిల్ రాజు ప్రొడక్షన్లో సినిమా చేయబోతున్నారని టాక్. `హుషారు` చూసి ఇంప్రెస్ అయిన పలువురు ప్రొడ్యూసర్లు శ్రీ హర్షను అప్రోచ్ అయ్యారు. అయితే ఆయన మాత్రం దిల్రాజు బ్యానర్ను ఎంపిక చేసుకున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనలైజింగ్ దశలో ఉంది. ఇప్పటికే పలుమార్లు స్టోరీ డిస్కషన్స్ జరిగాయట. త్వరలోనే ఫైనల్ వెర్షన్ని దిల్రాజుకు వినిపించడానికి శ్రీహర్ష సిద్ధమవుతున్నారు. సో అన్నీ ఓకే అనుకుంటే అప్పుడు నటీనటుల గురించి టాపిక్ వస్తుంది. ఈ సినిమాకు బెక్కం వేణుగోపాల్ కూడా అసోసియేట్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
previous post
next post