GodFather: దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 5వ తారీఖు “గాడ్ ఫాదర్” విడుదలయ్యి సూపర్ డూపర్ హిట్ కావడం తెలిసిందే. మలయాళం “లూసిఫర్” సినిమాకి రీమేక్ గా వచ్చిన గాని తెలుగు ప్రేక్షకులకు నచ్చే రీతిలో స్క్రిప్ట్ మొత్తం చేంజ్ చేసి చిరంజీవిని దర్శకుడు మోహన్ రాజా చూపించిన విధానం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా విజయంతో చిరంజీవితో పాటు సినిమా యూనిట్ ఫుల్ సంబరాలు చేసుకుంటూ ఉంది. సినిమా విజయం సాధించడం పట్ల మీడియా ప్రతినిధులు ఇంకా ఫిలిం ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు చిరంజీవిని ఇప్పటికే సత్కరించారు.
మరోపక్క సక్సెస్ మీట్ లలో సినిమా యూనిట్ ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంది. దర్శకుడు మోహన్ రాజా ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ తమన్, చిరంజీవి, నిర్మాతలు పాల్గొంటున్నారు. తాజాగా డైరెక్టర్ మోహన్ రాజాతో పాటు తమన్, సత్యదేవ్.. నిర్మాత పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా గాడ్ ఫాదర్ మార్నింగ్ షో పడిన తర్వాత ప్రముఖుల నుండి వచ్చిన రెస్పాన్స్ గురించి మోహన్ రాజ తెలియజేశారు. ఆరోజు పొద్దు పొద్దున్నే చరణ్ సార్ డైరెక్టుగా మా ఇంటికి వచ్చి సినిమా అద్భుతంగా వచ్చిందని అరగంట పాటు పొగిడారు.
ఇంకా కేరళ నుండి కూడా ప్రశంసలు వచ్చాయి. ఇక మెగా హీరో సాయిధరమ్ తేజ్.. డైరెక్ట్ గా మా ఆఫీస్ కి వచ్చి.. దాదాపు గంటన్నర పాటు నాతో మాట్లాడారు. ఇంకా బన్నీ అయితే 21 నిమిషాలు ఫోన్ లో మాట్లాడారు. సినిమా లడ్డులా ఉంది పిచ్చెక్కించేశారు.. అని బన్నీ పొగిడారు. ఇక ఆ తర్వాత మీడియా ప్రతినిధులు నుండి కూడా అభినందనలు వచ్చాయి అంటూ మోహన్ రాజా తాజా సక్సెస్ మీట్ లో కొత్త విషయాలు తెలియజేశారు.