సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “పుష్ప” ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా బన్నీ కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటువంటి ప్రమోషన్ కార్యక్రమాలు చేయకుండానే 100 కోట్లు కలెక్ట్ చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. బన్నీ కెరియర్ లో తొలి పాన్ ఇండియా సినిమాగా “పుష్ప” దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక ఊపు ఊపింది.
సినిమాలో డైలాగులు మరియు పాటలు ప్రాంతాలకు భాషలు అతీతంగా అందరిని ఆకట్టుకోవడం జరిగింది. రాజకీయ నాయకులు ఇంకా ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్లు ఈ సినిమా డైలాగులు చెబుతూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. తాజాగా “పుష్ప” పై డైరెక్టర్ పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. “లైగర్” ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా విజయ్ దేవరకొండతో కలిసి చార్మికి పూరి జగన్నాథ్ ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. అయితే “పుష్ప” లో క్లైమాక్స్ సీన్ బాగా నచ్చింది. విలన్ రౌడీ కలిసి కూర్చుని మాట్లాడుకునే సన్నివేశం చాలా కొత్తగా అనిపించింది. ఫైట్ లేదు.. ఏమీ లేదు.
“లైగర్” లో హీరోకి మరియు మైక్ టైసన్ కి మధ్య వచ్చే సన్నివేశం చాలా కొత్తది. ఇప్పటివరకు ఏ సినిమాలో లేనిది. మైక్ టైసన్ తో వచ్చే సన్నివేశాలు కచ్చితంగా ధియేటర్లో జనాలు ఎంజాయ్ చేస్తారని తనదైన శైలిలో పూరి జగన్నాథ్ ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఆగస్టు 25వ తారీకు విడుదల కానున్న “లైగర్” పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.