Manchu Vishnu: టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి సంబంధించి వారిపై ఎక్కువ ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మొదటి నుండి పనిగట్టుకుని మరి మంచు ఫ్యామిలీ మెంబర్స్ పై మిమిస్ .. ఇంకా ఫోటోలు రకరకాల వీడియోలు తో ట్రోల్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా “మా” అధ్యక్ష ఎన్నికలు జరిగిన సమయంలో.. మంచు విష్ణు పై విపరీతమైన ట్రోలింగ్ జరగటం తెలిసిందే. పరిస్థితి ఇలా ఉంటే విష్ణు తన కొత్త సినిమా “జిన్నా” ప్రమోషన్ కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తనపై ట్రోలింగ్ కి సంబంధించి
ప్రత్యేకంగా తనపై ట్రోల్ చేయడానికి… ఏకంగా 21 మంది పనిచేస్తున్నారని తెలిపారు. జూబ్లీహిల్స్ లోనే సదరు హీరో ఆఫీస్ ఉందని అన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ యువ హీరో ఆఫీసు నుండి జరుగుతుందని అన్నారు. ఆ యువ హీరో జూబ్లీహిల్స్ లోనే తన ఐటీ కంపెనీలో తనని మాత్రమే కాక తన కుటుంబం పై ట్రోలింగ్ చేయిస్తున్నారని విష్ణు ఆరోపించారు. దీనికి సంబంధించి అన్ని వివరాలు సేకరించడం జరిగిందని తెలిపారు. ఆ ఆఫీస్ చిరునామాతో పాటు.. వారు వినియోగించే ఐపి అడ్రస్ లను కూడా కనుగొన్నట్లు తెలిపారు.
ఈ క్రమంలో త్వరలోనే సైబర్ క్రైమ్ పోలీస్ అధికారులను కలసి సమగ్ర ఆధారాలతో కంప్లైంట్ చేస్తామని స్పష్టం చేశారు. గురువారం దాదాపు 18 యూట్యూబ్ చానెల్స్ పై కోర్టుకి వెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఖచ్చితంగా సదరు యూట్యూబ్ చానెల్స్ పై చర్యలు తీసుకోవడానికి …ఎంత దూరమైనా వెళ్తామని స్పష్టం చేశారు. యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం బిగ్ మీడియా ప్లాట్ ఫామ్. సినిమాలపై జోకులు …రివ్యూస్ ఇస్తే పర్వాలేదు. అందరం ఎంజాయ్ చేస్తాం. కానీ ఫ్యామిలీ మెంబెర్స్ జోలికి వస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అని అన్నారు. దీంతో మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి.