కీర్తి సురేష్ ప్రస్తుతం పూజా హెగ్డే, రష్మిక మందన్న లని దాటి దూకుడు పెంచేసింది. ఇప్పటికే తెలుగు తమిళం లో వరస సినిమాలలో బిజీగా ఉంది. త్వరలో తను నటించిన పెంగ్విన్ సినిమా నాలుగు భాషల్లో రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇక ఈ తెలుగులో నితిన్ సరసన రంగ్ దే సినిమాలో నటిస్తుండగా మహేష్ బాబు సర్కారు వారి పాట లో కూడా నటించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇంతలోనే కీర్తి సురేష్ కి మరో అవకాశం వచ్చినట్టు సమాచారం.
యాక్షన్ హీరో గోపీచంద్ తేజ దర్శకత్వంలో ‘అలిమేలుమంగ వేంకటరమణ’ టైటిల్ లో ఒక సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా తేజ ఈ సినిమాలో గోపీచంద్ కి జంటగా అలిమేలు మంగ పాత్రలో నటించే హీరోయిన్ విషయంలో పెద్ద డైలమాలో ఉన్నారు. ఇంతక ముందు ఆ పాత్రలో కాజల్ అగర్వాల్, అనుష్క నటిస్తారన్న వార్తలు రాగా ఆ ఇద్దరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలిసింది.
ఇప్పుడు ఈ పాత్రలో నటించే మరో స్టార్ హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. తనే కీర్తి సురేష్. తేజ అలిమేలుమంగ గా కీర్తి సురేష్ ను ఫైనల్ చేశారని తెలుస్తుంది. అయితే తేజ సినిమా అంటే కాస్తో కూస్తో గ్లామర్ గా నటించాలి. ఖచ్చితంగా హీరోయిన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. కాని గోపీచంద్ అంటే యాక్షన్ అండ్ కమర్షియల్ సినిమా .. కాబట్టి కీర్తి సురేష్ ఒప్పుకుంటుందా అని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. ఒకవేళ ఒప్పుకుంటే మాత్రం కీర్తి సురేష్ లో మార్పు వచ్చినట్టే అని అంటున్నారు.