పూజా హెగ్డే ..గత కొంతకాలంగా ఇండస్ట్రీలో మార్మోగిపోతున్న పేరు. అందుకు కారణం ఈ అమ్మడు నటించిన సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద భారీ సక్సస్ లను అందుకోవడమే. టాలీవుడ్ లో అందరీకి కావాల్సింది గోల్డెన్ లెగ్. పూజా ది గోల్డెన్ లెగ్ అని ఫిక్స్ అయ్యారు దర్శక నిర్మాతలు…హీరోలు. అందుకే చేసినవి తక్కువ సినిమాలైనా స్టార్ హీరోలతో నటించి అతి కొద్ది కాలంలోనే భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకునే స్థాయికి చేరుకుంది. చెప్పాలంటే ఇప్పుడున్న టాలీవుడ్ హీరోలలో పూజా హెగ్డే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటుంది.
2020 ప్రారంభంలోనే మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమా భారీ సక్సస్ ని అందుకుంది. ఈ సినిమా రాబట్టిన వసూళ్ళు అల్లు అర్జున్ కెరీర్ లోనే ఏ సినిమాకి రాలేదని ఆ స్థాయిలో “అల” వసూళ్ళు రాబట్టిందని యూనిట్ గొప్పగా చెప్పుకున్నారు. ఈ సినిమాలో పూజా హీరోయిన్. అంతేకాదు గురూజీ దర్శకత్వంలో నటించడం రెండవసారి.
ఇక ప్రస్తుతం పూజా హెగ్డే ప్రభాస్ సినిమాతో పాటు అఖిల్ సినిమా చేస్తోంది. మరోసారి త్రివిక్రం శ్రీనివాస్, ఎన్.టి.ఆర్ సినిమాలో నటించే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే దర్శక నిర్మాతలు పూజా హెగ్డే తో రిపీటెడ్ గా సినిమాలు చేయడానికి కారణం తన యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ అంటున్నారు. ముఖ్యంగా నిర్మాతలను ఏ రకంగాను రెమ్యూనరేషన్ విషయంలో ఇబ్బంది పెట్టదట. అంతేకాదు ఇప్పటి వరకు తను నటించిన ఏ సినిమాకి ఇంత కావాలి అని డిమాండ్ చేయలేదని చెప్పుకుంటారు. ఇలా నిర్మాతలకి సపోర్ట్ చేస్తే పూజా లాంటి హీరోయిన్ ని ఏ నిర్మాతైనా ఎలా వదులుకుంటారు చెప్పండి.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!