Vijay Sethupathi: తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినిమాలలో తన నటన ద్వారా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారో అందరికీ తెలిసిందే. విజయ్ సేతుపతి ఏ భాషలో సినిమా చేస్తే ఆ భాష హీరోగా ప్రేక్షకులు ఈయనను ఆదరిస్తారు.ఇక తమిళనాడు ప్రజలు అయితే ఈయన ఒక హీరోగా కాకుండా ఒక మంచి వ్యక్తిత్వం గల వ్యక్తిగా ఆదరించి అభిమానిస్తారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి కోసం పెద్ద పెద్ద నిర్మాతలు సైతం డేట్స్ కోసం ఎదురుచూస్తుంటారు. అయితే ఇంతటి క్రేజ్ విజయ్ సేతుపతికి ఏమంత సులభంగా రాలేదు.
సినిమా ఇండస్ట్రీలో ఇంతటి ఫాలోయింగ్ సంపాదించుకోవడానికి దాదాపు పది సంవత్సరాల సమయం పట్టింది. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. ఇండస్ట్రీలోకి వచ్చిన తొలిరోజుల్లో తిండి, నిద్ర లేక ఎన్నో కష్టాలు పడుతున్న సమయంలో తనను ఆదుకొని ఆదరించిన దర్శకుడు ఎస్పీ జననాథన్. తాజాగా మార్చి 14న ఈయన బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోయిన సంగతి అందరికీ తెలిసినదే. ఒక గొప్ప దర్శకుడి మరణం సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు ఏర్పడింది. 2003లో జాతీయ స్థాయి అవార్డును అందుకున్నారు. సామాజిక స్పృహ ఉన్న సినిమాలను తెరకెక్కించడంలో ఈయన దిట్ట. ప్రస్తుతం ఈ గొప్ప డైరెక్టర్ ను కోల్పోవడంతో చిత్రపరిశ్రమ మొత్తం విషాదంలో మునిగిపోయింది.
ఈ డైరెక్టర్ మరణం తర్వాత విజయ్ సేతుపతి అంత పని చేశాడు:
జననాథన్ చివరి సినిమా విజయ్ సేతుపతి, శృతిహాసన్ జంటగా తెరకెక్కించాడు. లాభం పేరుతో వ్యవసాయ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఇంతలోనే దర్శకుడు మరణించడంతో చిత్రబృందం ఎంతో విషాదంలో మునిగిపోయింది. అయితే తాను కష్టాల్లో ఉన్నప్పుడు అన్నం పెట్టి ఆదరించిన దర్శకుడు చనిపోతే అతను చేసిన సహాయానికి గుర్తుగా,అతనిపై ఉన్న గౌరవంతో విజయ్ సేతుపతి అతని ఆసుపత్రికి అయిన ఖర్చు మొత్తం తానే భరించాడు. ఒక్క రూపాయి కూడా తన కుటుంబంతో పెట్టినవ్వకుండా, ఆస్పత్రి బిల్లు మొత్తం కట్టి మానవత్వాన్ని చాటుకున్నారు. దర్శకుడు చనిపోయినప్పటి నుంచి అంత్యక్రియల వరకు తన కుటుంబంతోనే ఉన్నారు. ఆ దర్శకుడి విషయంలో తాను ఒక స్టార్ హీరో అనే విషయం మర్చిపోయి ఒక సామాన్య వ్యక్తిలా అతని అంత్యక్రియలలో పాల్గొనడం చూసి అక్కడున్న వారంతా ఎంతో షాక్ అయ్యారు.