KGF 2: సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లు స్టోరీలు రాయటానికి ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ ఫాలో అవుతారు. ఈ క్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. సినిమా స్టోరీలు రాయడానికి బ్యాంకాక్ దేశానికి వెళ్తారని అందరికీ తెలిసిందే. అక్కడ బీచ్ దగ్గర పూరి జగన్నాథ్ సినిమా కథలు ఎక్కువ రాస్తూ ఉంటారు అని చెబుతుంటారు. ఇదే విషయాన్ని పూరి కూడా పలు ఇంటర్వ్యూలలో చెప్పడం జరిగింది. ఇక “బాహుబలి” రైటర్ విజయేంద్ర ప్రసాద్.. ఎక్కడికి వెళ్ళకుండా.. ఇంటిలోనే గదిలో ఉండి స్టోరీలు రాస్తుంటారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ విషయాన్ని ఇటీవల RRR ఇంటర్వ్యూలో బయట పెట్టడం జరిగింది. కాగా ఇప్పుడు “కేజిఎఫ్”తో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దేశ వ్యాప్తంగా తనకంటూ సెపరేట్ గుర్తింపు దక్కించుకోవడం తెలిసిందే. ఈ సినిమా విజయంతో అందరి చూపు తన వైపు తిప్పుకున్నాడు. మొదటి పార్ట్ ఏ రీతిగా సూపర్ డూపర్ హిట్ అయిందో … ఇప్పుడు సెకండ్ చాప్టర్ కూడా దానికంటె డబల్ గా హిట్ కావడంతో.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు బాగా పాపులర్ గా మారింది. టాప్ డైరెక్టర్ లలో రాజమౌళి తర్వాత ప్రశాంత్ నీల్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగుతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇంతటి పాపులర్ ఉన్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు.. తాను సినిమా స్టోరీలు ఎలా రాస్తారో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. కచ్చితంగా స్టోరీ రాయడానికి ముందు మందు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఆ సమయంలో స్టోరీ రాయడం జరిగింది అదే స్టోరీ తర్వాత రోజు కూడా… మందు దిగిపోయాక కూడా గుర్తు ఉంటే.. ఇంకా దాన్ని పరిగణనలోకి తీసుకుని డెవలప్ చేయడం జరుగుతుందని తెలిపాడు. ఆ విధంగానే కేజిఎఫ్ స్టోరీ రాయడం జరిగిందని స్పష్టం చేశాడు. ఇక తనకి “గాడ్ ఫాదర్” సినిమా తో పాటు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆదర్శమని ప్రశాంత్ నీల్ … ఇంటర్వ్యూలో కీలక విషయాలు తెలియజేశారు.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!