గోవా బ్యూటీ ఇలియానా.. గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. దక్షిణాది అగ్రహీరో అజిత్ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అజిత్ నటిస్తున్న ‘వాలిమై’ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించనుందని టాక్. ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో ప్రారంభమైన విషయం తెలిసిందే. అజిత్ నటించిన ‘నెర్కొండ పారవై’ సినిమాకు దర్శకత్వం వహించిన హెచ్.వినోదే.. ఈ సినిమా చేస్తున్నాడు. పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు కాగా.. యామీ గౌతమ్ను ఇప్పటికే సెలక్ట్ చేసుకున్నారు. మరో హీరోయిన్గా ఇలియానా నటించనుందట. ఇప్పటికే చిత్రవర్గాలు ఆమెతో చర్చించాయని.. దానికి ఆమె అంగీకరించిందని సమాచారం.
బాలీవుడ్లో ఇలియానా నటించిన పాగల్ పంతీ ఇటీవలే విడుదలైంది. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అనిల్ కపూర్, జాన్ అబ్రహం తదితరులు నటించిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉంటే ది బిగ్ బుల్ అనే సినిమాలో కూడా ఆమె నటిస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది.