Cannes 2022: అనేక మంది దర్శకులకు నిర్మాతలకు లక్కీ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే. ఇండస్ట్రీలో గత కొంత కాలం నుండి బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సినిమాలలో ఎక్కువ హీరోయిన్ పాత్రలు చేసింది పూజా హెగ్డే. ఈ సెంటిమెంట్ తో చాలా మంది దర్శకులు మరియు నిర్మాతలు.. పూజా హెగ్డే నీ తీసుకుంటూ ఉన్నారు. అయితే ఇటీవల ఆచార్య, రాధేశ్యాం సినిమాలలో పూజా హెగ్డే హీరోయిన్ పాత్ర చేసి రెండు పరాజయాలు తన ఖాతాలో వేసుకోవడం జరిగింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదిలావుంటే ఇటీవల కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొనటానికి పూజా హెగ్డే వెళ్ళటం తెలిసిందే. అయితే అక్కడ రెడ్ కార్పెట్ పై మెరవాలనీ ఈ సొట్ట బుగ్గల సుందరి బ్యూటీ ప్రొడక్ట్ మరియు ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తులు… ప్యాక్ చేసుకోవడం జరిగింది. ముందుగానే ప్లాన్ చేసుకునే పూజా హెగ్డే టీమ్ మెంబర్స్ అంతా.. దుస్తులను సిద్దపరచారు. అయితే ఇండియా నుండి కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొనటానికి ఫ్రాన్స్ దేశంలో దిగాక… ఫిలిం ఫెస్టివల్లో పాల్గొనడానికి ప్రత్యేకంగా డిజైన్ చేసుకున్న దుస్తులు బ్యూటీ కిట్ మొత్తం మిస్ అయినట్లు పూజా హెగ్డే తాజాగా చెప్పుకొచ్చింది. దీంతో టీమ్ మెంబర్స్ మొత్తం నిరుత్సాహ పడ్డారు. ఎవరు కూడా భోజనం టిఫిన్ ఏమి చేయలేదు.
అయితే వాళ్ల నిరుత్సాహం చూసి నేనే ముందుకెళ్లి ఏం పర్లేదు రెడ్ కార్పెట్ పై.. మెరిసే రీతిలో.. కావలసిన వస్తువులు మొత్తం అన్ని ఇక్కడే కొనండి.. అని చెప్పటంతో వాళ్లు తక్కువ టైంలో అంతా సమకూర్చారు. దీంతో మీడియా, సినీ ప్రముఖుల సమక్షంలో డిజైనర్స్ ప్రత్యేకంగా తయారు చేసిన ఫెదర్స్ గౌన్లో బుట్టబొమ్మలా కనిపించింది. ఈ విషయాన్ని తాజాగా సోషల్ మీడియాలో పూజా హెగ్డే తెలిపింది. అయితే అదృష్టం కొద్దీ ఇండియాలో కొన్న బంగారు నగలు హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోవడం జరిగింది. లేకపోతే అవి కూడా మిస్ అయిపోయేవి అదృష్టం కొద్ది నా దగ్గర పెట్టుకున్నాను అంటూ పూజా హెగ్డే చెప్పుకొచ్చింది.