Radhey Shyam: దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత ప్రభాస్ నటించిన సినిమా విడుదల అవుతున్న తరుణంలో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన “రాదే శ్యాం” మార్చి 11 వ తారీకు అనగా రేపు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అవుతుంది. ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలలో ప్రభాస్ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం.. దేశవిదేశాలలో రిలీజ్ అవుతుంది. పైగా నిర్మాతలు తన కుటుంబ సభ్యులు కావటంతో… గతంలో ఎన్నడూ లేనివిధంగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ప్రభాస్ చురుగ్గా పాల్గొన్నాడు.
మీడియా సమావేశాలలో చాలా ప్రశ్నలకు తనదైన శైలిలో గతానికి భిన్నంగా సమాధానమిచ్చారు. సినిమా విషయాలు తెలియజేస్తూనే తన కెరీర్ గురించి కూడా అనేక విషయాలు ప్రమోషన్ కార్యక్రమాలలో ప్రభాస్ పంచుకోవడం జరిగింది. దీనిలో భాగంగా మొట్టమొదటిసారి రాజమౌళి దర్శకత్వంలో నటించిన “చత్రపతి” సినిమాలో ఆర్ట్ డైరెక్టర్ చేసిన పనిని గుర్తు చేసుకున్నారు. మేటర్ లోకి వెళ్తే ఆ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ గా చేసిన రవీందర్.. “రాదేశ్యాం” కి కూడా పని చేయడం జరిగింది. అయితే చత్రపతి సినిమా చేస్తున్న సమయంలో… సముద్రం ఒడ్డున కాట్రాజ్ అనే విలన్ తో భారీ ఎత్తున ఫైట్ వుంటుంది.
ఆ ఫైట్ సినిమా మొత్తానికి హైలెట్ గా నిలిచింది. ఆ యాక్షన్ సన్నివేశంలో ప్రభాస్ నీ… కాట్రాజ్ కర్రతో కొడుతూ ఉంటాడు. అయితే ఆ సన్నివేశంలో… సముద్రపు ఉప్పు తో చేసిన నిజమైన కర్రను ఇవ్వటం జరిగిందట. కానీ ఈ విషయం ప్రభాస్ కి అదేవిధంగా వెళ్ళడానికి తెలియదట. దీంతో విలన్ సుప్రీత్ డుపు కర్ర అనుకుని… తన వీపు గట్టిగా పట్టడం జరిగిందట. ఆ సమయంలో వీపు పగిలిపోయి నట్లయింది అంటూ చాలా సరదాగా ప్రభాస్ అప్పటి చత్రపతి షూటింగ్ విషయాలను ఇటీవల తెలియజేశారు. ప్రభాస్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా చత్రపతి నిలిచింది. ఈ సినిమాతో ప్రభాస్ కి మంచి మాస్ ఇమేజ్ రావడం జరిగింది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!